లబ్ధిదారుల పక్షాన పోరాటం
పేద ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సైకిల్ యాత్ర
తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన బాట పట్టారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి తన నిరసనను తెలియజేయనున్నారు.అందులో భాగంగా శుక్రవారం రామానాయుడు సైకిల్ యాత్ర శ్రీకారం చుట్టారు. పేదవారి సొంత ఇంటి కలని సాకారం చేయాలనే ఆలోచనతో టిడిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాన నాటి నుంచి వాటిని పేద ప్రజలకు అందజేయకుండా కక్షసాధింపుకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. లబ్దిదారుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు, అదేసమయంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో సైతం ఈ సమస్య పై చర్చ జరిగేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు తాను సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.