రెండు భారీ పండుగలకు సమాయక్తం!
తెలుగుదేశం పార్టీ రెండు భారీ పండుగలను జరుపుకునేందుకు సమాయక్తమవుతోంది! పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక ఒకటి కాగా.. ఆయన చేతులమీదిగా స్థాపించిన పార్టీ ఈ ఏడాదితో 40 ఏళ్లు నిండుతున్న కారణంగా అవిర్భావ దినోత్సవ వేడుకలు మరోవైపు నిర్వహించనున్నది టీడీపీ. అయితే ఏటా మే 27న ఎన్టీఆర్ జయంతినాడే మహానాడు పేరుతో టీడీపీ పెద్ద పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మే 27న మొదలై 28న ముగియనున్న ఈ వేడుకలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆనందాల్లో మునిగి తేలితారు. మహానాడు వేడుకలను పార్టీ ఏటా ఓ రేంజ్ లో జరుపుకుంటుంటే.. వీటికి తోడు 40 ఏళ్లు పూర్తికావడం, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కలిసిరావడంతో ఈ ఏడాది అవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీకి సమ్తింగ్ స్పెషల్లా నిలవనున్నాయి. అలానే ఈ వేడుకలకు నిర్వహణ కమిటీని నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది మందితో కమిటీని పార్టీ నియమించింది. నారా లోకేష్, కింజవరపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, సంధ్యారాణి, నిమ్మల రామానాయుడు, బీద రవీచంద్ర యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, చింతకాయల విజయ్ లను కమిటీలో సభ్యులుగా నియమిస్తూ.. చంద్రబాబు నిర్ణయించారు.
మహానాడు వేదికగా అధికారం దిశగా ప్రత్యేక కార్యచరణ!
మే 27, 28లలో మహానాడుని పెద్ద ఎత్తున టీడీపీ నిర్వహించనుంది. పార్టీ పరంగా ఎంతో ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది. ఇదిలా ఉంటే మహానాడు వేదికగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును అసెంబ్లీలో కూర్చోపెట్టేందుకు పార్టీ అధిష్టానం, శ్రేణులు సమాయక్తమవుతున్నాయి. ఇందుకు తగినట్లు ప్రత్యేక కార్యచరణను రూపొందించేందుకు సంసిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. మహానాడు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన అనంతరం.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ఏపీని చుట్టేయ్యడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మే 30 తో వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు నిండడంతో రానున్న రెండెళ్లు ప్రజల్లో ఉండేందుకు చంద్రబాబు కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్రను ప్రారంభించాలని భావిస్తుంటే.. లోకేష్ రాయలసీమ నుంచి తన పాదయాత్రను ప్రారంభించే దిశగా వ్యహరచన చేస్తున్నారు. అధికారపార్టీకి సీమ నుంచే చుక్కలు చూపించేందుకు లోకేష్ ఈ పాదయాత్రకు శ్రీకారం చుడతున్నారు. పార్టీ కూడా అందుకు తగినట్లు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు తన బస్సు యాత్ర ప్రారంభించి 175 నియోజకవర్గాల్లో గెలుపుకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్ర సుదీర్ఘంగా కాలం పాటు సాగుతోంది. ఏపీలో మొత్తం కవర్ అయ్యేలా ఆయన పాదయాత్ర సాగనున్నది. ఇప్పటికే సర్వేలన్నీ అధికార వైసీసీ పతనాన్ని సూచిస్తున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వైసీపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు అధికారపార్టీని ఇంటికి సాగనంపేందుకు ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. ఇదే అదునుగా చంద్రబాబు, నారా లోకేష్ లు పూర్తికాలం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు వ్యహకర్తలు!
Must Read:-మంత్రి బాలినేని పై అమిత్ షా కు ఫిర్యాదు!? న్యాయం కోసం ఢిల్లీ వెళ్లిన సుబ్బారావు గుప్తా!