కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు హోల్డ్!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచి కౌంటింగ్ వరకు సన్నివేశాలు, సంఘనలన్నీ ఉద్రిక్తతమే. ప్రతి ఘనట ఉత్కఠత రేపేలా కొండపల్లిని పూర్తి సెన్సిటివ్ చేసింది అధికారపార్టీ. కౌన్సిలర్ల సంఖ్యబలం తక్కువగా ఉండి కూడా తొండాట ఆడి చైర్మన్ చైర్ ను కౌవసం చేసుకోవాలని భావించిన అధికారపార్టీ లక్ష్యాలకు టీడీపీ నాయకత్వం తూట్లు పొడిచింది. ఎత్తుల పైఎత్తు వేసి అధికారపార్టీని కొండపల్లిలో మట్టికరిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 నే చైర్మన్, కౌల్సిలర్ల ప్రమాణస్వీకారోత్సవాలు జరపగా .. కొండపల్లిలో పొలిటికల్ హైడ్రామా కాకరేపింది. అధికారం, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాతీర్పును తప్పుదోవ పట్టించాలని కుయుక్తులు పన్నారు. కానీ ఫలించలేదు. ఎందుకంటే న్యాయం, ధర్మానికి చట్టం తోడైంది కాబట్టి!
సర్వశక్తులు ఒడ్డి .. కొండపల్లిపై జెండా ఎగరేసి!
కొండపల్లిపై టీడీపీ జెండాను ఎగరవేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. వ్యూహప్రతివ్యూహాల నడుమ టీడీపీ పత్తం దక్కించుకుంది. ఎన్నికల్లో వైసీసీ 14, టీడీపీ 15 స్థానాలను కౌవసం చేసుకోగా .. ఎక్స్ అఫిషియో ఓటు కీలంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ టీడీపీ కొండపల్లి అధికార పీఠాన్ని దక్కించుకుంది. చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ ఛైర్మన్ గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్ గా కరిపికొండ శ్రీ లక్ష్మీని ఏకగ్రీవంగా టీడీపీ కౌన్సిలర్ సభ్యులు ఎన్నుకున్నారు. టీడీపీ రెబల్ అభ్యర్థికి కోటి రూపాయాలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసిన న్యాయం వైపు నిలబడి అధికారపార్టీ అకృత్యాన్ని ఎండగట్టారని ఎంపీ కేశినేని నాని గుర్తు చేశారు.
Must Read ;- కొండపల్లిలో కండకావరం!