‘బాహుబలి’ సినిమా చరిత్ర సృష్టించడం.. ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టడం.. ముఖ్యంగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసి తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించడం తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు మాంచి ఊపు వచ్చిందని చెప్పచ్చు. ఈ సినిమా స్పూర్తితో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియచేసారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది.
బాహుబలి స్పూర్తితో తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘బాహుబలి’ రేంజ్ లో రామాయణం సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని అల్లు అరవింద్.. మధు మంతెన, నమిత్ మల్హత్ర లతో కలిసి నిర్మించనున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్టు తెలియచేసారు. ఈ సినిమా ప్రకటించినప్పుడు ఇందులో రాముడు పాత్ర ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పేరు వినిపించింది. అలాగే ప్రభాస్ పేరు కూడా వినిపించింది. అయితే.. ఈ భారీ చిత్రాన్నిప్రకటించి సంవత్సరం అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. తాజా వార్త ఏంటంటే.. ఈ మూవీ ఆగిపోలేదట. ఈ సంచలన చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. రామాయణం అంటే అందరికీ తెలిసిందే. అయితే.. దీనిని కొత్తగా చెప్పబోతున్నారట. ఇందులో ఎవరు నటించనున్నారంటే.. స్ర్కిప్ట్ లాక్ చేసిన తర్వాతే నటీనటులు ఎవరు అనేది ఫైనల్ చేస్తారట.
పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి నటీనటులను ఎంపిక చేయనున్నారని తెలిసింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో రాముడు పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమాలో రాముడుగా మరో హీరోకి ఛాన్స్ ఉంటుంది. మరి.. ఎవరు రాముడు పాత్ర పోషించే ఛాన్స్ దక్కించుకుంటారో చూడాలి.
Must Read ;- ప్రభాస్ తెలుగు నిర్మాతలకు హ్యాండ్ ఇవ్వడానికి కారణం ఇదేనా.?











