యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సంచలన చిత్రం తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ప్రస్తుతం కొరటాల శివ.. ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఓ పది రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆచార్య మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే.. కొరటాల శివ, ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ వర్క్ స్టార్ట్ చేస్తాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. అందుకనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు అంటున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే.. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మేకర్స్ నుంచి త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం.
ఇందులో విజయ్ సేతుపతి ఏ పాత్రను పోషించనున్నాడో తెలియదు కానీ.. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ పాన్ ఇండియా మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది.
must read ;- లిటిల్ టైగర్ ఫొటో ఏది యంగ్ టైగర్?