February 8, 2023 12:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విజయవాడ తెలుగు తమ్ముళ్ల రచ్చ.. శ్వేత రాయబారంతో రాజీ

అధినేత చంద్రబాబు జోక్యంతో విజయవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య రేగిన చిచ్చు సద్దుమణిగింది. కేశినేని శ్వేత రాయబారంతో ప్రస్తుతానికి రాజీ కుదిరింది.

March 6, 2021 at 6:40 PM
in Andhra Pradesh, Latest News, Politics
విజయవాడ తెలుగు తమ్ముళ్ల - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బెజవాడ తెలుగుదేశం పార్టీలో రచ్చకెక్కిన  గ్రూపు రాజకీయాలు చంద్రబాబు జోక్యంతో చల్లారాయి. కొద్ది రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయనగా టీడీపీ నేతలు ఇవాళ చెలరేగిపోయారు. ఎంపీ కేశినేని నానిపై విజయవాడ నగరానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి విషయంలో రెండు వారాల కిందట వివాదం చెలరేగింది. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానం అని ఎంపీ కేశినేని నాని ధిక్కారస్వరం వినిపించారు. తన వెనుక ఎవరైనా నడవాల్సిందే కానీ, తాను అవినీతి పరుల వెనుక నడవనంటూ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోయినా పరవాలేదని, తనకు నష్టం లేదని, తుడిచిపెట్టుకుపోయేది టీడీపీయేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీడీపీకి చంద్రబాబు అధిష్ఠానం అయితే, విజయవాడ టీడీపీకి తానే అధిష్టానం అని ఎంపీ కేశినేని ప్రకటించుకున్నారు. దీనిపై బెజవాడ టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే చంద్రబాబు జోక్యంతో విజయవాడ టీడీపీ నేతలు మెత్తపడ్డారు. చంద్రబాబునాయుడు రాజీనామా చేయమంటే ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేస్తానంటూ కేశినేని దిగివచ్చారు.

బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడును ఏక వచనంతో సంభోదించినప్పుడే ఎంపీ కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినని, కానీ చంద్రబాబుపై తనకు ఉన్న గౌరవంతో వదిలేశానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇవాళ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కూడా ఎంపీ కేశినేనిపై విరుచుకుపడ్డారు. పార్టీ కోసం తాము ప్రాణాలు ఫణంగా పెట్టామని, కేశినేని నాని పదవుల కోసం పాకులాడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీపై  కేశినేని నాని కులపార్టీ ముద్ర వేస్తున్నాడని, ఇది అందరి పార్టీ అని బోండా ఉమ ఫైర్ అయ్యారు. పార్టీకి తాము కావాలా, ఎంపీ కేశినేని నానీ కావాలో అధినేత చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలని బోండా ఉమా ప్రకటించారు. రేపు విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొనబోయే ప్రచారంలో తాను పాల్గొనడం లేదని బోండా ఉమ ముందు ప్రకటించారు. అయితే కాసేపటికే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి అందరితో మాట్లాడి సర్దుబాటు చేశారు. రేపు విజయవాడలో చంద్రబాబు నిర్వహించే ప్రచారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బోండా ఉమ ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జి మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కేశినేని శ్వేతను వెంటబెట్టుకుని బోండా ఉమ ఇంటికి వెళ్లారు. దీంతో అందరూ ఒక్కటయ్యారు. చంద్రబాబు సీరియస్‌గా తీసుకోవడంతో టీడీపీ నేతల మధ్య రచ్చ వ్యవహారం ప్రస్తుతానికి చల్లబడింది.

ఎవరికి వారే యమునా తీరే..

విజయవాడ సిటీ టీడీపీలో అసలేం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అందరూ కలసి పనిచేయాలని చెప్పిన తరవాత కూడా ముగ్గురు సీనియర్ టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ అధిష్టానం కేశినేని నాని కూతురు శ్వేతను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అందరూ కలసి పనిచేయాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ఆదేశించారు. పది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న విజయవాడ టీడీపీ నేతలు ఇవాళ ఉన్నట్టుండి మరలా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. దీని వెనుక ఏం జరిగింది అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత మేయర్ కావడం ఇష్టం లేకనే బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాలు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారని తెలుస్తోంది. వారికి ఇష్టం లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తరవాత అందరూ కలసి పనిచేసుకోవాల్సి ఉంది. అయితే విజయవాడ టీడీపీలో ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు.

ఎంపీ కేశినేని నాని ఒంటరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడ పశ్చిమలో జలీల్ ఖాన్ సహకారం తీసుకున్నారు. ఇక విజయవాడ తూర్పులో గద్దె రాంమ్మోహన్ వివాద రహితుడు. ఏ వర్గాలను వెనుకేసుకు రాడు. దీంతో ఈ ప్రాంతంలో కూడా కేశినేనికి ఇబ్బంది లేదు. అయితే తమ అనుచరులకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇప్పించుకోవడంలో ఆ ముగ్గురు నేతల మాట చెల్లలేదని వారు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేశినేని నానిపై తీవ్ర విమర్శలకు దిగారని తెలుస్తోంది. అధిష్టానం సీరియస్ కావడంతో ఆ ముగ్గురు నేతలు కాస్త తగ్గారు. విజయవాడలో టీడీపీ గెలుపునకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతామని వారు ప్రకటించారు.

టీ కప్పులో తుఫాను

విజయవాడలో టీడీపీ అభ్యర్థులు గెలవడానికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు ప్రకటన చేయడం, విజయవాడలో అభివృద్ధి కుంటుపడటం, పన్నుల పెంపు ఇలా అనేక కారణాలతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. దీన్ని అందిపుచ్చుకుంటే టీడీపీ మేయర్ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే టీడీపీలో గ్రూపు రాజకీయాలు విజయావకాశాలను దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. అందరూ కలసి పనిచేస్తే టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా….గ్రూపు రాజకీయాలతో విజయవాడ నేతలు రచ్చకెక్కుతున్నారు. ఈ అంశం టీడీపీ అధినేతను కూడా కలవర పెడుతోందని తెలుస్తోంది. అంతా బాగున్నట్టే అనిపించినా ఇలా రోడ్డున పడి తిట్టుకోవడంతో పార్టీ పరువు కూడా పోయినట్టయింది. ఎన్నికలు అతి సమీపంలో ఉండగా ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విజయావకాశాలను గండికొట్టేదిగా ఉంది. విజయవాడ టీడీపీ నేతల నోళ్లు మూయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అందుకే కేశినేని శ్వేత ఆ ముగ్గురు అసమ్మతి నేతలను కలసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. దీంతో అంతా సర్థుమనిగినట్టు కనిపిస్తోంది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడలో టీడీపీ గెలవడానికి ఉన్న అవకాశాలకు నేతల మధ్య పోరు గండికొట్టే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు సాగుతున్నాయి.

Must Read ;- టీడీపీ దూకుడు, వైసీపీలో తడబాటు.. హాట్ హాట్‌గా విజయవాడలో ఎన్నికల ప్రచారం

Tags: Editorspickleotopsweta went to umas house to get supporttelugu newsvijayawada tdp leaderss issue subsidised with chandrababu interference
Previous Post

‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ మూవీ మొదలుపెట్టనున్న శర్వానంద్

Next Post

శ్రీకారం ప్రీ రిలీజ్ కు మెగాస్టార్ చిరంజీవి

Related Posts

Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

by Leo Cinema
February 3, 2023 6:16 pm

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు...

Andhra Pradesh

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

by Leo Cinema
February 2, 2023 6:58 pm

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక...

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Online Dating Safety and How to Recognize Red Flags

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ     

Actress Pragathi Latest Pics Going Viral

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

సంపాదకుని ఎంపిక

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

రాజకీయం

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

సినిమా

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

జనరల్

Online Dating Safety and How to Recognize Red Flags

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In