జీతాలు మీద బతికే ఉద్యోగులకు ఒక నెల జీతం ఆగిపోతేనే ఎన్నో సమస్యలు. కనీసం వచ్చే నెలలో వస్తే.. మెల్లగా సర్దుబాటు చేసుకుందాంలే అనుకుంటారు. కానీ, ఏకంగా 3-4 నెలలపాటు జీతాలు ఆగిపోతే వారి జీవనం ఎలా సాగాలి. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు వైజాగ్ ఉద్యోగులు.గత 4 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు ఉద్యోగులు.
ఈ విషయమై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఫలితం లేకపోయింది. జీతాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారం కూడా లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక తమ నిరసన ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనుకున్న ఉద్యోగులు.. జీతాల కోసం రోడ్డెక్కారు. వైజాగ్లోని VIMS దగ్గర నిరసన తెలియజేయడం ప్రారంభించారు. చేత ఫ్లకార్డులు పట్టుకుని తమ జీతాలను వెంటనే విడుదల చేయాలంటూ నినదిస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదల అవుతుందో లేదో చూడాలి.
Also Read: వీర్రాజు మాటల్లో కుట్రకోణం దాగి ఉందా?