ఎవరు మాట్లాడుతుంటే ఫ్రస్టేషన్ వస్తుందో.. ఎవరు అరుస్తుంటే చిరాకు పుడుతుందో.. ఎవరు అడ్డంగా వాదిస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుందో ఆయనే విష్ణువర్ధన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర నేత. రాయలసీమలో ఈ మధ్య హల్చల్ చేస్తున్న నేత. టీవీ చర్చలతో ఫేమస్ అయిపోయి ఇప్పుడు పెద్ద నాయకుడు అయిపోయినట్లు ఫోజు పెడుతున్న ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదా ఎందుకు అవసరం లేదో ఘంటాపథంగా గుక్క తిప్పుకోకుండా చెప్పగలడు. నిధులు ఇవ్వకపోయినా.. నిధులు ఇచ్చినట్లు చెప్పాలన్నా ఈయనకే ఈయనే సాటి. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నా సరే .. బీజేపీయే ఈ రాష్ట్రానికి అత్యంత మేలు చేసిన పార్టీ అని బల్లగుద్ది చెప్పగలడు. అంతటి వాగ్ధాటి ఉంది మరి. తప్పో, ఒప్పో గట్టిగా వాదిస్తే సరి. అదే చేస్తాడాయన. అలాగే ఫేమస్ అయ్యాడు. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ట్రబుల్లో పడినట్లు కనపడుతోంది. నోరు విప్పలేక.. కక్కలేక మింగలేక నానా పాట్లు పడుతున్నట్లు సమాచారం.
సీక్రెట్ ఓపెన్ చేసిన సీపీఐ నేతలు
ఎవరో స్వామిజీ ఆశ్రమంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తే.. భక్తులను కాపాడే ఆ స్వామీజీని కాపాడటానికి ఈయనగారు ముందుకొచ్చి డీల్ సెట్ చేసుకున్నట్లు తెగ టాక్ నడుస్తోంది. ఒక ప్రముఖ పత్రిక, ఛానెల్లో ఈ కథనం వచ్చింది. అయితే అందులో ఈయనగారి పేరు లేదు. ఇప్పుడు లేటెస్టుగా ఆ డీల్ చేసుకున్నవాళ్లు ఈయనేనని సీపీఐ నేతలు సీక్రెట్ ఓపెన్ చేసేశారు. దీంతో రూ.30 కోట్ల డీల్ చేసుకుంది విష్ణువర్ధన్ రెడ్డేనటగా అంటూ తెగ స్టోరీలు నడిచేస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో.
ఫ్రొఫెసర్కే 80 శాతం మంది మద్దతు
ఇంతకీ సారువారు కొన్ని రోజుల క్రితమే ఓ చానెల్ డిబేట్లో అమరావతి జేఏసీ నేత, ప్రొఫెసర్ శ్రీనివాసరావు చేతిలో చెప్పుదెబ్బ తిన్నాడు. అది కూడా లైవ్లో. దెబ్బకు ఖంగు తిన్నాడు. ఇష్టమొచ్చినట్లు వాగితే ఎన్నాళ్లు నడుస్తుంది మరి. పెయిడ్ ఆర్టిస్ట్ అని ఓ ప్రొఫెసర్ని అంటే కొట్టడా మరి. అదే జరిగింది. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ముందు సర్దుకుపోదామనుకున్నా.. సోషల్ మీడియాలో ఫ్రొఫెసర్కే 80 శాతం మంది మద్దతు ప్రకటించడంతో.. డ్యామేజ్ మామూలుగా లేదని ఇగో హర్ట్ అయిపోయింది. ఆయనతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశాడట. మరి తర్వాత ఏమైందో ఏమో గాని.. ఆ పత్రిక, చానెల్ను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ అధికారికంగా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది.
ఆ మీడియాలోనే స్టోరీ వెల్లడి
ఆ తర్వాత ఈ స్టోరీ ఆ మీడియాలోనే వచ్చింది. దీంతో ఇప్పుడు తగలబడిపోతున్న తన రాజకీయ కెరీర్ను ఎలా చల్లార్చుకోవాలో.. ఎలా కాపాడుకోవాలో తెలియక విష్ణువర్ధన్ రెడ్డి పొర్లు దండాలు పెట్టే పనిలో ఉన్నాడట. ఏం చేసి దీని నుంచి బయటపడాలో అర్ధం కాక సతమతమైపోతున్నాడు. ఏ ఎంపీనో, ఎమ్మెల్యేనో అయిపోవచ్చనుకుంటే.. ఈ మొత్తం ఎపిసోడ్లలో అధిష్టానం ముందు కూడా వేస్ట్ క్యాండేట్ అయిపోయాడు. మరి కొన్నాళ్లు సైలెంట్గా ఉండి.. మళ్లీ మొదలుకాడ్నించి మొదలెడతాడేమో చూడాలి మరి.