ఈ పదాలు చూస్తే ఇదేదో కాలానికి సంబంధించిన వార్తేమో అనిపిస్తోంది కదూ. ఇది ఆనాటి నటీమణుల సినిమా కాలానికి సంబంధించిన వార్త. వీరిద్దరూ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. వయసు పెరిగితే భామ కాస్తా అమ్మగా మారిపోతుంది.. ఇంకొంత కాలం గడిస్తే బామ్మగానూ తెరపై వెలిగిపోవచ్చు. ‘జంబలకిడిపంబ’ ఆమని అప్పుడప్పుడూ తెరపై కనిపిస్తున్నా సీత మాత్రం నల్లపూస అయిపోయందనే చెప్పాలి. సీత నటిగా తమిళంలోనే కాదు తెలుగు ప్రజలకూ సుపరిచితమే. ఆడదే ఆధారం, డబ్బెవరికి చేదు, సగటు మనిషి, న్యాయం కోసం, ముద్దుల మావయ్య లాంటి చిత్రాలు చేశారు. ఆ తర్వాత వయసు ప్రభావంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోక తప్పలేదు.
అలా గంగోత్రి, సింహాద్రి, బన్నీ తదితర చిత్రాల్లో తళుక్కుమన్నారు. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇప్పుడామె తన ప్రయారిటీలో తెలుగు సినిమాలను పెట్టుకుందట. తెలుగంటే నాకెంతో ప్రేమ అంటోంది. అదెందుకో తెలుసా.. నిజానికి ఆమె తెలుగింటి మహిళే. ఆమె పూర్వికులంతా విజయనగరం వారే. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. తమిళ నటుడు పార్తీబన్ తో బంధం ఉన్నా తెలుగు సినిమాతో తనకు అనుబంధం ఎక్కువంటున్న సీత మళ్లీ తెలుగులో ఓ వెలుగు వెలగాలని తహతహలాడుతోంది.
Must Read ;- నవరస నటసుధ.. జయసుధ (జన్మదిన ప్రత్యేకం)
ఆమని పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది జంబలకిడి పంబ. ఈవీవీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నటిగా ఆమనికి ఎంతో పేరు తెచ్చింది. శుభలగ్నం, శుభసంకల్పం, మావిచిగురు, శుభమస్తు లాంటి చిత్రాలతో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు అమ్మగా మారిపోయింది. అంతకాదు ఏకంగా ‘అమ్మదీవెన’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ఇక బ్యాచ్ లర్, చావుకబురు చల్లగా చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతా బాగానే ఉందిగానీ ఆమెకు సంబంధించిన ఓ వార్త గుప్పుమంది.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఆ వార్త సారాంశం. దీనిపి ఆమని ఓ వీడియో విడుదల చేసింది. అవన్నీ పుకార్లేనని, షూటింగ్ కోసం మంచిర్యాల వెళితే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని, తనతోపాటు 20 మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. అంతే తప్ప తనకు గుండె పోటు వచ్చిందని, మరొకటని వచ్చే పుకార్లను నమ్మవద్దంటూ ఆమె మీడియాను కోరింది. అందుకే సీతాకాలం వెళ్లిపోలేదు.. ఆమనికి ఏమీ కాలేదు.
Must Read ;- అందాల భామకు అవకాశాలేవీ!