సినీరంగలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఏ సినిమాతో మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే అలాంటి మంచి సమయం కోసమే అంతా ఎదురు చూస్తుంటారు. మలయాళీ భామ పూర్ణ కూడా దాదాపు పదిహేనేళ్లుగా సినిమాలు చేస్తోంది. అడపాదడపా వచ్చే అవకాశాలతో కెరీర్ ఎట్టో నెట్టుకొస్తున్నప్పటికీ మంచి హిట్ రావడం అందని ద్రాక్ష పండే అయ్యింది లోగడ రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘అవును’ చిత్రం ఆమెకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రవిబాబు వరుస అవకాశాలు ఇచ్చారు కూడా. లడ్డుబాబు, అవును 2 చిత్రాలు రవిబాబుతో పాటు పూర్ణకు పరాజయాలు తెచ్చిపెట్టాయి.
అయినప్పట్టికీ అప్పుడప్పుడు వచ్చే అవకాశాలతో కెరీర్ కొనసాగిస్తున్న ఆమెకు ఇప్పడు తాను చేయబోతున్న చిత్రాలతో విజయాలను అందుకుని మరింత బిజీ అవుతానని అనుకుంటోంది. ఇందులో అన్ని చిత్రాలు కథానాయకిగా కాకపోయినా ఈ భారీ అంచనాల చిత్రాలు తప్పకుండా తన కెరీర్ మలుపు తిరిగేందుకు కారణం అవుతాయని ఆమె ఎన్నో ఆశలతో ఉంది. మరోవైపు తాను టైటిల్ పాత్రలో నటిస్తున్న ‘సుందరి’ చిత్రంపై ఆమెకు ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. అమాయకురాలైన ఓ మహిళ పరిస్థితుల ప్రేరణతో ఎలా ప్రవర్తించింది అన్న ప్రధాన అంశంతో ఈ చిత్రాన్ని మలుస్తున్నారట. ఇందులోని టైటిల్ పాత్రలో పూర్ణ నటన అల్టిమేట్ అని చిత్ర బృందం చెబుతోంది.
ఇక నందమూరి బాలకృష్ణ కధానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా పూర్ణ ఓ పాత్రలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో ఆమె కథానాయిక కాకపోయినప్పటికే తాను చేస్తున్న ముఖ్య పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలియాల్సి ఉంది . ఇదిలావుండగా…తమిళ, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో కూడా పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుండగా..తమిళ దర్శకుడు ఎ ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ క్రేజీ చిత్రంలో జయలలిత స్నేహితురాలైన శశికళ పాత్రలో పూర్ణ నటిస్తోంది. ఇవే కాకుండా తమిళంలో నటించే ‘విశిష్టిరం’ చిత్రం కూడా తన కెరీర్ కు ఎంతో ఉపయోగ పడుతుందని పూర్ణ అంటోంది.
Must Read ;- నా కెరీర్ లో ఓ మైలురాయి ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ : సీనియర్ నటి అన్నపూర్ణమ్మ