సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈపాటికే సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా వలన ఆలస్యం అయ్యింది. ఇందులో మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేసినప్పటికీ.. కరోనా తగ్గకపోవడంతో ముందుగా హైదరాబాద్ లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో మహేష్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడా..? ఇదేదో గాసిప్ అనుకున్నారు. అయితే.. జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అదీ కాకుండా.. ప్రస్తుతం పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందుచేత ఇది నిజమేనేమో అనుకున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడం కాదు.. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ నటించనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు వదిన పాత్ర కోసం రేణుదేశాయ్ ని సంప్రదించారట. రేణుదేశాయ్ ని మహేష్ బాబుకి మదర్ గా నటిస్తారా అని గతంలో ఓ ఇంటర్ వ్యూలో అడిగితే.. మహేష్, ప్రభాస్ సినిమాల్లో వాళ్ల చిన్నప్పటి క్యారెక్టర్ కి మదర్ గా నటిస్తానన్నారు. మరి.. ఇప్పుడు మహేష్ మూవీలో వదిన క్యారెక్టర్ కోసం ఆఫర్ వచ్చింది అంటున్నారు. మరి..ఇదే కనుక నిజమైతే రేణుదేశాయ్ ఎస్ అంటారో నో అంటారో చూడాలి.