నమ్మించి గొంతుకోశారు ..
జగన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం ఉద్యోగ సమస్యలు వారంలోనే తప్పక పరిష్కరిస్తానని నమ్మించి తమ ఓట్లతో గద్దెనెక్కారని ఉద్యోగులు మండిపడుతున్నారు. పీఆర్సీ సాధన కోసం ‘చలో విజయవాడ’ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలపెట్టిన భారీ ర్యాలీ, సభ కార్యక్రమం విజయవంతం అవ్వడంతో ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయటానికి కుట్రలు పన్నింది. చర్చలు పేరుతో స్టీరింగ్ కమిటీతో భేటి అయ్యి, భూటకపు హామీలతో వారిని ఒప్పించి చేతలు దులుపుకున్నారు. కానీ ఆనాటి హామీలేవి నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి.. వారి హక్కుల సాధనకోసం పోరాటాలు చేస్తున్నారు. మంగళవారం విజయవాడలో మహిళా దినోత్సవం నాడు మున్సిపల్ మహిళా ఉద్యోగులు నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్ మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు. మాట తప్పారు .. మడం తిప్పారంటూ జగన్ రెడ్డి విధానాలను ఎండగట్టారు. నమ్మించి మోసం చేసిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. మిశ్రా నివేదికను ఆలస్యంగా బయట పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో నివేదిక ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. మున్సిపల్ కార్మికులకు రూ.20 వేల వేతనం ఉండగా.., రూ.15 వేలు మాత్రమే ఇస్తూ.. తమ హక్కులను తుంగలో తొక్కుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని నినదించారు. తక్షణమే జగన్ కార్మికుల సమస్యలు పరిష్కించాలని డిమాండ్ చేశారు.
Must Read:-జగన్ సర్కారుకు ఊహించని షాక్..