గన్నవరంలో గత రెండు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్పై కన్నేశాడు ఎమ్ఎల్ఏ వల్లభనేని వంశీ.. గతంలో విజయం సాధించిన రెండుసార్లు వల్లభనేని వంశీ టీడీపీ తరఫున పోటీచేశారు.. ప్రస్తుతం ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీకి చేరువయ్యారు.. ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు.. టీడీపీ అసంతృప్త ఎమ్ఎల్ఏగా ఉన్న వల్లభనేని వంశీ… వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీకి సిద్దం అయ్యారు.. ఇప్పటికే సకల శాఖా మంత్రి సజ్జలతో టికెట్ దాదాపు కన్ఫర్మ్ చేయించుకున్నారు.. వల్లభనేని ఎంట్రీతో ఆ పార్టీని నమ్ముకున్న దుట్టా, యార్లగడ్డ…. కినుక వహించారు.. యార్లగడ్డ అయితే టీడీపీకి జంప్ చేశారు..
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో యార్లగడ్డ ఫుల్ జోష్లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో నిర్బంధించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనపై సానుభూతి విపరీతంగా పెరిగింది.. తాజాగా బాబుకి మధ్యంతర బెయిల్ దక్కడంతో చంద్రబాబుని రాజమండ్రి జెయిల్ నుండి విజయవాడ వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు.. ఏకంగా 13 గంటలపాటు వివిధ పట్టణాలలో భారీ జనసందోహం, స్వాగత సత్కారాల మధ్య విజయవాడకు చేరుకున్నారు చంద్రబాబు..
గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబుని చూడడానికి పలు సెంటర్లలో భారీగా ప్రజలు నిరీక్షించారు.. గంటల తరబడి వెయిట్ చేశారు… అర్ధరాత్రి వేళ రోడ్లపైనే పడిగాపులు కాస్తూ, అక్కడే నిద్రపోతూ బాబుని చూడాలని వేలాదిగా తరలివచ్చారు ప్రజలు.. ఇక్కడే గన్నవరం టీడీపీ నేత యార్లగడ్డ తన ఉదారతను చాటుకున్నారు. బాబుకోసం నిరీక్షిస్తోన్న వేలాదిమందికి టిఫిన్లు, టీలు అందేలా చర్యలు తీసుకున్నారు.. వారికి వాటర్ బాటిల్స్ అందించారు.. రోడ్లపై ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయన చర్యలు చేపట్టారని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
గన్నవరంలో ఎమ్ఎల్ఏగా గెలవాలని పట్టుదలగా ఉన్న యార్లగడ్డకి బాబు అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్నతో ఆయన ఫుల్ ధీమాగా ఉన్నారు.. గన్నవరంలో తన అనుచర గణానికి, టీడీపీ వేవ్, జగన్ దారుణమైన పాలనతో అంతా కలిసి వస్తోందని, ఈసారి తన జీవిత లక్ష్యం నెరవేర్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు.. ఇదే ఇప్పుడు వల్లభనేనిని టెన్షన్ పెడుతోంది.. 2019లో కేవలం 850 ఓట్లతో బయటపడిన తనకు ఈసారి యార్లగడ్డని తట్టుకోవడం కష్టమనే అంచనాకి వచ్చాడట వల్లభనేని.. మొత్తమ్మీద, అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో యార్లగడ్డ సక్సెస్ అవుతున్నారనే చర్చ మొదలయింది.. వల్లభనేని ఏం చేస్తాడో చూడాలి..











