January 28, 2023 2:48 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

తెలుగు దేశం పార్టీకి పెరుగుతున్న జనాదరణ చూసి వైసీపీ గుంపు రాజకీయం చేస్తోంది. చంద్రబాబు ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం తండోపతండాలు వస్తుండటంతో వైసీపీ బెంబేలెత్తుతోంది. అందులో భాగంగానే బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది.

January 5, 2023 at 2:26 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎక్కడ అణచి వేత ఉంటుందో అక్కడే తిరుగు బాటు ఉంటుంది. ఆ తిరుగు బాటులో భాగంగానే చంద్రబాబు బహిరంగ సభలకు జనం పోటెత్తు తున్నారు. అందుకు తగిన విధంగా పోలీసులను నియమించి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతో తొక్కిస లాటలు జరుగుతున్నాయి. ప్రజలు ఆలస్యమైనా దార్శనికులనే గుర్తు పెట్టుకొంటారని, వినాశకులను, విధ్వంసకులను కాదని చంద్రబాబు సభలకు వస్తున్నజనం రుజువు చేస్తున్నారు.

జగన్ డొల్ల తనం ప్రజలకు అర్ధం అయి చంద్రబాబు సభలకు జనం గుట్టలు పడుతున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇస్తే ప్రజాశ్రేయస్సును విస్మరించి స్వప్రయోజనాలే ధ్యేయంగా పాలన సాగిస్తూ నవ్యాoధ్ర ను నాశనం చేస్తుంటే ప్రజలు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు? చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్నిచూసి జగన్ రెడ్డి శిభిరంలో కలవరం మొదలయి సంస్కారం,మానవత్వం మరచి నీచరాజకీయం చేస్తున్నారు. కందుకూరులో చంద్రబాబు బహిరంగ సభకు జనం జన సునామీలా రావడంతో దురదృష్టవ శాత్తు తొక్కిస లాట జరిగి ఎనిమిది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోవడం భాధాకర అంశమే, వూహించకుండా జరగ రానిది జరిగింది.అందరూ భాధపడుతున్నదుర్ఘటన.కానీ ఆ సందర్బంగా జరిగిన మరణాలను చంద్రబాబు చేసిన హత్యలుగా చిత్రించి మాట్లాడటం అంటే వైసీపీ గుంపు నీచ, నికృష్ట రాజకీయాలకు నిదర్శనం.

పోటో షూట్ ల కోసం- డ్రోన్ షాట్ ల కోసం జనం లేక పోయినా వచ్చారని చూపించడం కోసం చిన్న గొంది లోకి జనాన్ని నెట్టి ఎనిమిది మందిని చంపేశారని,పుష్కరాల సందర్భంగా 29 మందిని చంపేశారని ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉందా అని నర్సీపట్నం సభలో జగన్ రెడ్డి మాట్లాడారు.అంతే కాదు రాజకీయాలు చెడిపోయాయని సుద్దులు చెప్పారు.కానీ రాజకీయాన్ని వికృతంగా మార్చి రాజకీయాలను ధ్వంసం చేస్తున్న జగన్ రాజకీయాలు చెడిపొయ్యాయని నీతులు చెప్పడం చూసి గురివిందలు సిగ్గుపడుతున్నాయి. విపరీత మనస్తత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన జగన్ రెడ్డి తోటి వారిని కూడా అలానే చూస్తున్నారు. కందుకూరులో అన్నీ రాజకీయ పార్టీలు పెట్టిన చోటనే సభ నిర్వహించారు చంద్రబాబు. అయినా కావాలని ఇరుకు సందులో పెట్టారని అబద్దాలకు తెగబడ్డారు ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు.

చంద్రబాబు సభలకు వస్తున్న జనం జగన్ కళ్ళకి కనపడక పోవచ్చు. వారి పోలీస్, ఇంటిలిజెన్స్ వారి కళ్ళకు కూడా కనపడటం లేదా? అసమర్ధ పాలన పై ప్రజలు తిరగబడతారన్నభయంతో జనం రాకపోయినా మీ వెంట వేలమంది పోలీసులను తెచ్చుకొంటున్న జగన్ రెడ్డి, ప్రతిపక్షనాయకుడు సభలకు స్వచ్చందంగా వేల మంది తరలి వస్తుంటే పోలీసులకు భధ్రత కల్పించాల్సిన భాధ్యత లేదా? పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడటం కోసమే వున్నారా? ప్రజలను కాపాడటానికి లేరా? కందుకూరు,గుంటూరు ఘటనలను సాకుగా చూపి ప్రతిపక్షాల గొంతు నొక్కే,అణచి వేసే కుట్రకు పాల్పడటం అత్యంత దుర్మార్గం . ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలను వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక అడ్డుకొనేందుకు చీకటి జీవో జారీ చేసింది. ప్రతి పక్షాల ర్యాలీలు,సభల పై నిషేధం విధించడం దుర్మార్గం పు చర్య. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని నిబంధనలు విదించిన ప్రభుత్వం, తాము రాసిచ్చిన ప్రసంగాన్నే చదవాలని కూడా నిబంధన విధించదన్న నమ్మకం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా?రాచరికమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సభలు పెట్టుకొనే హక్కు కూడా లేదా?అణచి వేత,నిర్భందం పెత్తందారులు, ప్యాక్షనిస్టులు తప్ప మరొకరు చెయ్యలేరు.

దేశం లో ఏ ప్రభుత్వం ఈ విధమైన వికృత రూపం ప్రదర్శించడలేదు. ప్రతి పక్షాలు,మీడియా ప్రభుత్వానికి భజన చెయ్యాలి అనుకోవడం ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యం? జగన్ ప్రతిపక్షంలో వున్నప్పుడు పాదయాత్రలు,రోడ్లపై సభలు,ధర్నాలు,దీక్షలు చెయ్యలేదా?మీరు సభలు,సమావేశాలు పెట్టవద్దని జీఓ లు జారీ చేస్తే ప్రతిపక్షాలు చేతులు కట్టుకొని నిలబడాలా? ప్రతిపక్షాల,పత్రికల స్వేచ్చకు గోరీ కట్టే నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు.స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి కి తానూ చేస్తున్న పనుల్లో,కార్యక్రమాల్లో తప్పులు కనిపించవు. తన ప్రయోజనాలు తప్ప. శవ రాజకీయాల్లో అత్యంత నేర్పరి, ప్రతిభావంతుడు జగన్ రెడ్డి. చావు రాజకీయాల్లో విశేషమైన నైపుణ్యం సాధించారు జగన్, ఆయన పార్టీ నాయకులు.తండ్రి రాజశేఖర రెడ్డి శవపునాదుల పై మొలిసిన మొక్కే వైసీపీ. దురదృష్టవ శాత్తు వూహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోతే తండ్రి దుర్మరణం చెందిన స్థలానికి వెళ్ళి బౌతిక కాయాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నించకుండా ముఖ్యమంత్రి ఫీటంపై కన్నేసి, భౌతిక కాయం ఇంటికి రాకుండా తాను ముఖ్యమంత్రి కావడానికి ఆరాటపడుతూ ఏం ఎల్ ఏ లతో సంతకాల సేకరణకు దిగి శవరాజకీయాలు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.

ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా రాజశేఖర రెడ్డి మరణ వార్త విని చనిపోయ్యారని వారిని కూడా తమ ఖాతాలో వేసుకొని ఓదార్పు యాత్ర చేపట్టి శవ రాజకీయం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.ఓదార్పు పేరుతో తన తండ్రి పై వున్న సానుభూతిని తన వైపు తిప్పుకొనేందుకు జగన్ ఆడిన అంతర్నాటకం ప్రజలు మర్చిపోలేదు.2012లో ఉమ్మడి రాష్ట్రం లో వచ్చిన ఉపఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు తన తండ్రి మరణానికి సోనియాగాంధీ నే కుట్ర పన్నారని ప్రచారం చేసి ఓట్లు పోగేసుకొన్న ఘనుడు జగన్ రెడ్డి. అటువంటి వ్యక్తి రాజకీయాలు చెడిపోయ్యాయని,చెడిపోయిన వ్యవస్థతో యుద్దం చేస్తున్నామని చెప్పడం చూసి గురివిందలు సిగ్గు పడుతున్నాయి. మొదట తండ్రి వైఎస్,తర్వాత తాను,తర్వాత చిన్నాన్న వివేకానందరెడ్డి లతో శవరాజకీయాట ఆడిన వ్యక్తి జగన్ రెడ్డి.విశాఖ విమానా శ్రయంలో తన అభిమానే జగన్ రెడ్డిని కోడి కత్తి తో గుచ్చినప్పుడుకూడా ఇంకేముంది నన్ను చంపించడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కుట్ర పన్నారని నానా యాగీచేసి చంద్రబాబును హంతకుడిగా చిత్రించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేశారు.

కోడికత్తి డ్రామా రక్తి కట్టకట్టలేదు. తర్వాత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహంలోనే దారుణ హత్యకు గురి అయ్యారు.ఉదయం వివేకాది సహజ మరణమ నిచెప్పిన వారు మధ్యాన్నం నుండి స్వరం మార్చి ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ హత్య చేయించారని ప్రచారం మొదలు పెట్టి సొంత మీడియాలో నారా సుర రక్తచరిత్ర అంటూ కధనాలు రాసి 2019 ఎన్నికల్లో శవ రాజకీయ చేసి లబ్దిపొందారు.జగన్ సొంత బాబాయి హత్య ద్వారా వచ్చిన సానుభూతిని తన రాజకీయ పెట్టుబడిగా మార్చుకొన్నారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు పై నెట్టకుండా జగన్ కు రాజకీయ జీవితం లేదు.అట్లాగే తన తండ్రిని రిలయన్స్ వారు చంపించారని నానా యాగిచేసిన జగన్ రెడ్డి, అధికారంలోకి రాగానే రిలయన్స్ వారు చెప్పిన వారికే రాజ్యసభసీటు ఇచ్చారు. అవినీతి, అరాచకం, అవకాశవాదం, శవరాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప ఎటువంటి ప్రజా సిద్ధాంతం లేకుండా అబద్దాలతో పార్టీని స్థాపించి జగన్ రెడ్డి శవ రాజకీయాలతో రాజ్యం ఏలుతున్నారు.

కందుకూరు సభలో ఎనిమిదిమందిని చంద్రబాబు చంపేశారని ఇష్టాను సారం నోరు పారేసుకొంటున్న ముఖ్యమంత్రి,మంత్రులు,వైసీపీ నాయకులు దీనికి సమాదానం చెప్పాలి. జగన్ రెడ్డి కుటుంభ సభ్యుల పాదయాత్రలో,జగన్ పాదయాత్రల లోకానీ,జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిద ప్రమాదాల్లో చనిపోయిన వారిని జగన్ రెడ్డి చంపేశారని అంగీకరిస్తారా? అవి జగన్ రెడ్డే చంపేశారని అంగీకరించి, కందుకూరు సభ మరణాలు చంద్రబాబు కు చుడితే అర్ధవంతంగా వుంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక ఘటనలతో దాదాపు 200 మంది మరణించారు వీటికి ముఖ్యమంత్రి భాధ్యత వహిస్తారా?ఎక్కడ ఎంత మంది చనిపోయినా ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను పరామర్సించి ఎరుగరు. మంచి పరిపాలన అందించి ప్రజలను మెప్పించి అధికారంలోకి రావడం చేతకాక ,శవ రాజకీయాలు చేసి మళ్ళీ అధికారం లోకి రావాలని చూస్తున్న జగన్ రెడ్డి మూటా. అధికారం చేజారబోతుందని జగన్ శిభిరంలో కలవరం మొదలయి శవరాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడటమే మహా నేరం అన్నవిధంగా వ్యవహరిస్తున్నది జగన్ ప్రభుత్వం. పేదలు పెత్తం దారులు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ రెడ్డి మీ అక్రమ సంపాదనను పేద ప్రజలకు పంచి ఇవ్వగలరా?ప్రపంచ పెత్తం దారుల్లో జగన్ రెడ్డిని మించిన పెత్తం దారులు లేరని గుర్తించాలి.

Tags: ycp wrong allegations about chandrababu meetings
Previous Post

సాగునీటి రంగంపై ఎందుకు ఇంత వివక్ష?

Next Post

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

by Leo Editor
January 6, 2023 5:15 pm

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ...

Latest News

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

by Leo Editor
January 6, 2023 4:17 pm

ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In