ఎక్కడ అణచి వేత ఉంటుందో అక్కడే తిరుగు బాటు ఉంటుంది. ఆ తిరుగు బాటులో భాగంగానే చంద్రబాబు బహిరంగ సభలకు జనం పోటెత్తు తున్నారు. అందుకు తగిన విధంగా పోలీసులను నియమించి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతో తొక్కిస లాటలు జరుగుతున్నాయి. ప్రజలు ఆలస్యమైనా దార్శనికులనే గుర్తు పెట్టుకొంటారని, వినాశకులను, విధ్వంసకులను కాదని చంద్రబాబు సభలకు వస్తున్నజనం రుజువు చేస్తున్నారు.
జగన్ డొల్ల తనం ప్రజలకు అర్ధం అయి చంద్రబాబు సభలకు జనం గుట్టలు పడుతున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇస్తే ప్రజాశ్రేయస్సును విస్మరించి స్వప్రయోజనాలే ధ్యేయంగా పాలన సాగిస్తూ నవ్యాoధ్ర ను నాశనం చేస్తుంటే ప్రజలు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు? చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్నిచూసి జగన్ రెడ్డి శిభిరంలో కలవరం మొదలయి సంస్కారం,మానవత్వం మరచి నీచరాజకీయం చేస్తున్నారు. కందుకూరులో చంద్రబాబు బహిరంగ సభకు జనం జన సునామీలా రావడంతో దురదృష్టవ శాత్తు తొక్కిస లాట జరిగి ఎనిమిది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోవడం భాధాకర అంశమే, వూహించకుండా జరగ రానిది జరిగింది.అందరూ భాధపడుతున్నదుర్ఘటన.కానీ ఆ సందర్బంగా జరిగిన మరణాలను చంద్రబాబు చేసిన హత్యలుగా చిత్రించి మాట్లాడటం అంటే వైసీపీ గుంపు నీచ, నికృష్ట రాజకీయాలకు నిదర్శనం.
పోటో షూట్ ల కోసం- డ్రోన్ షాట్ ల కోసం జనం లేక పోయినా వచ్చారని చూపించడం కోసం చిన్న గొంది లోకి జనాన్ని నెట్టి ఎనిమిది మందిని చంపేశారని,పుష్కరాల సందర్భంగా 29 మందిని చంపేశారని ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉందా అని నర్సీపట్నం సభలో జగన్ రెడ్డి మాట్లాడారు.అంతే కాదు రాజకీయాలు చెడిపోయాయని సుద్దులు చెప్పారు.కానీ రాజకీయాన్ని వికృతంగా మార్చి రాజకీయాలను ధ్వంసం చేస్తున్న జగన్ రాజకీయాలు చెడిపొయ్యాయని నీతులు చెప్పడం చూసి గురివిందలు సిగ్గుపడుతున్నాయి. విపరీత మనస్తత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన జగన్ రెడ్డి తోటి వారిని కూడా అలానే చూస్తున్నారు. కందుకూరులో అన్నీ రాజకీయ పార్టీలు పెట్టిన చోటనే సభ నిర్వహించారు చంద్రబాబు. అయినా కావాలని ఇరుకు సందులో పెట్టారని అబద్దాలకు తెగబడ్డారు ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు.
చంద్రబాబు సభలకు వస్తున్న జనం జగన్ కళ్ళకి కనపడక పోవచ్చు. వారి పోలీస్, ఇంటిలిజెన్స్ వారి కళ్ళకు కూడా కనపడటం లేదా? అసమర్ధ పాలన పై ప్రజలు తిరగబడతారన్నభయంతో జనం రాకపోయినా మీ వెంట వేలమంది పోలీసులను తెచ్చుకొంటున్న జగన్ రెడ్డి, ప్రతిపక్షనాయకుడు సభలకు స్వచ్చందంగా వేల మంది తరలి వస్తుంటే పోలీసులకు భధ్రత కల్పించాల్సిన భాధ్యత లేదా? పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడటం కోసమే వున్నారా? ప్రజలను కాపాడటానికి లేరా? కందుకూరు,గుంటూరు ఘటనలను సాకుగా చూపి ప్రతిపక్షాల గొంతు నొక్కే,అణచి వేసే కుట్రకు పాల్పడటం అత్యంత దుర్మార్గం . ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలను వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక అడ్డుకొనేందుకు చీకటి జీవో జారీ చేసింది. ప్రతి పక్షాల ర్యాలీలు,సభల పై నిషేధం విధించడం దుర్మార్గం పు చర్య. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని నిబంధనలు విదించిన ప్రభుత్వం, తాము రాసిచ్చిన ప్రసంగాన్నే చదవాలని కూడా నిబంధన విధించదన్న నమ్మకం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా?రాచరికమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సభలు పెట్టుకొనే హక్కు కూడా లేదా?అణచి వేత,నిర్భందం పెత్తందారులు, ప్యాక్షనిస్టులు తప్ప మరొకరు చెయ్యలేరు.
దేశం లో ఏ ప్రభుత్వం ఈ విధమైన వికృత రూపం ప్రదర్శించడలేదు. ప్రతి పక్షాలు,మీడియా ప్రభుత్వానికి భజన చెయ్యాలి అనుకోవడం ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యం? జగన్ ప్రతిపక్షంలో వున్నప్పుడు పాదయాత్రలు,రోడ్లపై సభలు,ధర్నాలు,దీక్షలు చెయ్యలేదా?మీరు సభలు,సమావేశాలు పెట్టవద్దని జీఓ లు జారీ చేస్తే ప్రతిపక్షాలు చేతులు కట్టుకొని నిలబడాలా? ప్రతిపక్షాల,పత్రికల స్వేచ్చకు గోరీ కట్టే నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు.స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి కి తానూ చేస్తున్న పనుల్లో,కార్యక్రమాల్లో తప్పులు కనిపించవు. తన ప్రయోజనాలు తప్ప. శవ రాజకీయాల్లో అత్యంత నేర్పరి, ప్రతిభావంతుడు జగన్ రెడ్డి. చావు రాజకీయాల్లో విశేషమైన నైపుణ్యం సాధించారు జగన్, ఆయన పార్టీ నాయకులు.తండ్రి రాజశేఖర రెడ్డి శవపునాదుల పై మొలిసిన మొక్కే వైసీపీ. దురదృష్టవ శాత్తు వూహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోతే తండ్రి దుర్మరణం చెందిన స్థలానికి వెళ్ళి బౌతిక కాయాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నించకుండా ముఖ్యమంత్రి ఫీటంపై కన్నేసి, భౌతిక కాయం ఇంటికి రాకుండా తాను ముఖ్యమంత్రి కావడానికి ఆరాటపడుతూ ఏం ఎల్ ఏ లతో సంతకాల సేకరణకు దిగి శవరాజకీయాలు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.
ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా రాజశేఖర రెడ్డి మరణ వార్త విని చనిపోయ్యారని వారిని కూడా తమ ఖాతాలో వేసుకొని ఓదార్పు యాత్ర చేపట్టి శవ రాజకీయం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.ఓదార్పు పేరుతో తన తండ్రి పై వున్న సానుభూతిని తన వైపు తిప్పుకొనేందుకు జగన్ ఆడిన అంతర్నాటకం ప్రజలు మర్చిపోలేదు.2012లో ఉమ్మడి రాష్ట్రం లో వచ్చిన ఉపఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు తన తండ్రి మరణానికి సోనియాగాంధీ నే కుట్ర పన్నారని ప్రచారం చేసి ఓట్లు పోగేసుకొన్న ఘనుడు జగన్ రెడ్డి. అటువంటి వ్యక్తి రాజకీయాలు చెడిపోయ్యాయని,చెడిపోయిన వ్యవస్థతో యుద్దం చేస్తున్నామని చెప్పడం చూసి గురివిందలు సిగ్గు పడుతున్నాయి. మొదట తండ్రి వైఎస్,తర్వాత తాను,తర్వాత చిన్నాన్న వివేకానందరెడ్డి లతో శవరాజకీయాట ఆడిన వ్యక్తి జగన్ రెడ్డి.విశాఖ విమానా శ్రయంలో తన అభిమానే జగన్ రెడ్డిని కోడి కత్తి తో గుచ్చినప్పుడుకూడా ఇంకేముంది నన్ను చంపించడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కుట్ర పన్నారని నానా యాగీచేసి చంద్రబాబును హంతకుడిగా చిత్రించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేశారు.
కోడికత్తి డ్రామా రక్తి కట్టకట్టలేదు. తర్వాత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహంలోనే దారుణ హత్యకు గురి అయ్యారు.ఉదయం వివేకాది సహజ మరణమ నిచెప్పిన వారు మధ్యాన్నం నుండి స్వరం మార్చి ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ హత్య చేయించారని ప్రచారం మొదలు పెట్టి సొంత మీడియాలో నారా సుర రక్తచరిత్ర అంటూ కధనాలు రాసి 2019 ఎన్నికల్లో శవ రాజకీయ చేసి లబ్దిపొందారు.జగన్ సొంత బాబాయి హత్య ద్వారా వచ్చిన సానుభూతిని తన రాజకీయ పెట్టుబడిగా మార్చుకొన్నారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు పై నెట్టకుండా జగన్ కు రాజకీయ జీవితం లేదు.అట్లాగే తన తండ్రిని రిలయన్స్ వారు చంపించారని నానా యాగిచేసిన జగన్ రెడ్డి, అధికారంలోకి రాగానే రిలయన్స్ వారు చెప్పిన వారికే రాజ్యసభసీటు ఇచ్చారు. అవినీతి, అరాచకం, అవకాశవాదం, శవరాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప ఎటువంటి ప్రజా సిద్ధాంతం లేకుండా అబద్దాలతో పార్టీని స్థాపించి జగన్ రెడ్డి శవ రాజకీయాలతో రాజ్యం ఏలుతున్నారు.
కందుకూరు సభలో ఎనిమిదిమందిని చంద్రబాబు చంపేశారని ఇష్టాను సారం నోరు పారేసుకొంటున్న ముఖ్యమంత్రి,మంత్రులు,వైసీపీ నాయకులు దీనికి సమాదానం చెప్పాలి. జగన్ రెడ్డి కుటుంభ సభ్యుల పాదయాత్రలో,జగన్ పాదయాత్రల లోకానీ,జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిద ప్రమాదాల్లో చనిపోయిన వారిని జగన్ రెడ్డి చంపేశారని అంగీకరిస్తారా? అవి జగన్ రెడ్డే చంపేశారని అంగీకరించి, కందుకూరు సభ మరణాలు చంద్రబాబు కు చుడితే అర్ధవంతంగా వుంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక ఘటనలతో దాదాపు 200 మంది మరణించారు వీటికి ముఖ్యమంత్రి భాధ్యత వహిస్తారా?ఎక్కడ ఎంత మంది చనిపోయినా ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను పరామర్సించి ఎరుగరు. మంచి పరిపాలన అందించి ప్రజలను మెప్పించి అధికారంలోకి రావడం చేతకాక ,శవ రాజకీయాలు చేసి మళ్ళీ అధికారం లోకి రావాలని చూస్తున్న జగన్ రెడ్డి మూటా. అధికారం చేజారబోతుందని జగన్ శిభిరంలో కలవరం మొదలయి శవరాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడటమే మహా నేరం అన్నవిధంగా వ్యవహరిస్తున్నది జగన్ ప్రభుత్వం. పేదలు పెత్తం దారులు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ రెడ్డి మీ అక్రమ సంపాదనను పేద ప్రజలకు పంచి ఇవ్వగలరా?ప్రపంచ పెత్తం దారుల్లో జగన్ రెడ్డిని మించిన పెత్తం దారులు లేరని గుర్తించాలి.