జగన్ రాజకీయాలు చూస్తే వింతగానూ, వికృతంగానూ ఉంటాయి. సింగయ్య మృ*తి కేసులో జగన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ. పల్నాడు పర్యటనలో జగన్ కారు క్రింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చని*పోతే కనీసం పట్టించుకోలేదు. అతనిని నిర్ధాక్షిణ్యంగా రోడ్డు పక్కకి ఈడ్చి పడేశారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సింగయ్యను చూసి స్థానికులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింగయ్య మర*ణించాడు. ఈ ఘటన జరిగిన మర్నాడు జగన్ తాడేపల్లి ప్యాలస్లో మీడియాతో మాట్లాడిన జగన్….నా కార్యకర్త నా కారు కిందే పడి చనిపోతే నాకు బాధ కలగదా..?మా పార్టీ నేతలను అతని ఇంటికి పంపించి పది లక్షల ఆర్ధిక సాయం అందించానన్నారు జగన్.
సింగయ్య మృ*తిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, జగన్ కారు కిందే సింగయ్య పడి చనిపోయాడని ఫోరెన్సిక్ నివేదికతో ధృవీకరించుకొని విచారణ జరుపుతున్నారు. ఆ కేసులో పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని ఊహించిన జగన్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేసి రెండు వారాలు గడువు పొందారు.
కానీ తాజాగా సింగయ్య భార్య లూర్దు మేరీని జగన్ ప్యాలస్కు పిలిపించుకొని మాట్లాడిన తర్వాత, ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా భర్త సింగయ్య మృ*తిపై నాకు అనుమానాలున్నాయి. సింగయ్యని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకువెళుతున్నప్పుడు ఏదో చేసి ఉంటారని నాకు అనుమానంగా ఉందని చెప్పారు. జగన్ కారు క్రింద పడి నలిగిపోవడం వల్లనే తన భర్త చనిపోయాడని ఆమెకు తెలిసి ఉన్నప్పటికీ, ఆమె చేతనే అంబులెన్సులో ఏదో చేసి ఉండవచ్చని చెప్పించడం జగన్ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పుకోవచ్చు.
నిజానికి సింగయ్య తన కారు కింద పడినప్పుడే జగన్ వెంటనే స్పందించి తన కాన్వాయ్లోని వాహనంలోనో లేదా వెంట వస్తున్న వాహనంలోనో ఆస్పత్రికి తరలించి ఉండాలి. అది కనీసం మానవత్వం. కానీ తీవ్రంగా గాయపడి ప్రాణపాయంతో ఉన్న సింగయ్యని నిర్ధాక్షిణ్యంగా పక్కకి లాగేసి వెళ్లిపోయారు. ఆమె భర్త చావుకి కారణమైన జగన్, ఆమెను కూడా తన శ*వ రాజకీయాలలో పావుగా వాడుకోవడం చూస్తుంటే ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. జగన్కు శ*వరాజకీయాలు కొత్తకాదు.











