కడపజిల్లా కలసపాడు మండలం మామిళ్లపళ్లి గ్రామ పరిదిలోని ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుడులో పది మంది కూలీలు మృతి చెందారు. మరికొంత మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ముగ్గురాయిని వెలికితీసేందుకు తీసుకువచ్చిన పేలుడు పదార్థాలు దింపేప్పుడు మొత్తం ఒకేసారి పేలాయని ప్రాధమికంగా తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరూ లేని సమయంలో పేలుడు పదార్థాలు వాడుతూ ఉంటారు. కానీ పేలుడు పదార్థాలు వ్యాను నుంచి దింపుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడు మృత దేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు.
జగన్కి ఢిల్లీ టెన్షన్..? కేజ్రీవాల్, కవిత అరెస్టులతో వైసీపీలో వణుకు..!!
ఏపీలో అన్ని స్థానాల్లో విజయం మనదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఏపీ సీఎం...