అంగళ్లు అల్లర్లు కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజురు చేస్తూ తీర్పు నిచ్చింది. అలానే సుప్రీం కోర్టులో చంద్రబాబు తరుఫున వేసిన స్కిల్ డెవలప్మెంట్ ఎఫ్ఆర్ఐ క్వాష్.., ఫైబర్ గ్రిడ్ పిటిషన్లు వచ్చే మంగళవారానికి వాయిదా పడ్డాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో జస్టిస్ అనిరుద్ బోస్.., జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుఫున సిద్ధార్థ్ లూధ్రా వాదనలు వినిపించగా.., ప్రభుత్వం తరుఫున ముకుల్ రోహిత్గీ వాదనలు వినింపించారు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును రోహిత్గీ ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత సెక్షన్స్ వర్తిస్తాయని అన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగింది కాబట్టి..దీన్ని నేరంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అందుకే చంద్రబాబు కేసు విషయంలో 17ఏ వర్తించదు రోహిత్గీ వాదించారు.
ఈ క్రమంలో కౌంటర్ వాదనగా లూధ్రా వాదనలు వినిపిస్తూ.. కేసులపై కేసులు పెట్టి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చంద్రబాబుపై ఎన్నికేసులు పెట్టినా.. 17ఏ వర్తించిదని చెప్పారు. అయితే ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా 17ఏ ను ఛాలెంజ్ చేస్తారా..? అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా.. అవును అని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ను వాదనలు మంగళవారం వింటామని జస్టిస్ త్రివేది చెప్పారు. అయితే ఫైబర్ గ్రిడ్ కేసులో సుప్రీం సూచనలను ఏసీబీ కోర్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ఆదేశించింది.అలానే స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ వాదనలు మరోసారి మంగళవారం వింటామని ధర్మాసనం చెప్పింది.