స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి.. జైల్లో ఉన్నలో చంద్రబాబు ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఆయన అరెస్ట్ జరిగి సరిగ్గా నేటి 35 రోజులు కావస్తోంది. జైల్లో చంద్రబాబుకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. కరడు కట్టిన ఉగ్రవాదులకు, ఆర్ధిక నేరస్తులకు సైతం జైల్లో ఉంటే సకల వసతులు కల్పించే ప్రభుత్వాలు.. మాజీ ముఖ్యమంత్రి, అది ప్రతిపక్ష నేత.., సీనియర్ ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబుకు జైల్లో కనీస వసతి కల్పించడంలో ఎందుకు ఘోరంగా విఫలమౌతోందన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఆరోగ్యాన్ని కావలనే క్షీణింపజేస్తే…జైలు గోడల మధ్య ఆయనను తుదముట్టించాలనే జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
జైలు అధికారులు ఆయన ఉంటున్న గదిలో ఎయిర్ కండీషన్, స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వలేని విధంగా ఆయన పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని కుటుంబ సభ్యులు.., పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నేరం నిరూపితం కాకుండా కేవలం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి కనీస వసతులు కల్పించాలన్న ఇంగితం లేని పాలకుడు ఏపీకి ఉండటం సిగ్గు చేటని తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే చర్మానికి సంబంచిన అలర్జీ రాగా.., అమాంత 5 కేజీల బరువుతగ్గి.. ఆరోగ్యం తీవ్ర స్ధాయిలో క్షీణించింది. దీనిపై వైద్యులు హెల్త్ బులిటెన్ అందజేశారు. అది చూసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.., కొడలు నారా బ్రాహ్మణి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరో రెండు కిలోలు తగ్గితే ఆయన కిడ్నీలు డ్యామేజీలు అవుతాయని అవేదన వ్యక్తం చేశారు. 73 ఏళ్ళ వయసులో అలా చంద్రబాబు అవయవాలు ఏమైన డ్యామేజ్ అయితే.. కోలు కోవడం కష్టమని.. ఆయనకు స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కనీసం చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల సలహాల మేరకైనా ఆయనకు చికిత్స అందిచేలా జైలు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.