వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో భారీ ఝలక్ తగలనుందా..?? ఆయన ఊహించని రీతిలో షాక్ తగలనుందా..?? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.. ఏపీలో తనను అత్యంత దారుణంగా ఓడించిన, ఆయన పాలనని చీదరించుకున్న ప్రజలపై విచిత్రంగా వెన్నుపోటు దినోత్సవం అంటూ తిరుగుబాటు జెండా ఎగరేశాడు జగన్.. కేవలం 11 స్థానాలు ఇచ్చి అసహ్యించుకున్న ప్రజలపై పగ, కక్షతోనే జగన్.. వెన్నుపోటు దినోత్సవం అని నిరసన, ధర్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.. ఈ విషయం వైసీపీలోని కొందరు సీనియర్ నేతలకి కూడా అర్ధం అయిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. అందుకే, ఆ నేతలు జగన్ వెన్నుపోటు దినోత్సవానికి దూరంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు..
వెన్నుపోటు దినోత్సవాన్ని వాడవాడలా, వీధివీధిలో నిర్వహించాలని జగన్ ప్లాన్ చేశారు.. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత ఉందని, కూటమి సర్కార్పై అసంతృప్తిగా ఉన్నారని చిత్రీకరించాలని ప్యాలెస్ నేతలు స్కెచ్ వేశారు.. జగన్ ఆలోచనలపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విరుచుకుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.. జగన్ పిలుపుని రోజా, అంబటి, బొత్స, విడదల రజినిలాంటి కొందరు నేతలు మినహా ఎవరూ కనిపించలేదని గుర్తు చేస్తున్నారు.. ఎక్కడా సరయిన స్పందన లేకపోవడంతో సాక్షి చానెల్ ఖాళీగా ఉన్న నిరసలు, దీక్షణలని ప్రసారాలు చేయాలో తెలియక ఖంగుతిన్నదని తెలుస్తోంది..
ఇదంతా ఒక ఎత్తయితే, జగన్ పిలుపుని ఆ పార్టీలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు లైట్ తీసుకున్నారు.. శ్రీకాకుళంలో వైసీపీ నిర్వహించిన నిరసన దీక్షకు ఆయన దూరంగా ఉన్నారు.. హాజరు కాలేదు.. గత కొన్ని రోజులుగా వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ధర్మాన ప్రసాదరావు.. ఆయన ఫ్యాన్ గాలికి దూరమై, టీడీపీ, జనసేనలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో కథనాలు వినిపిస్తున్నాయి.. తమని తిరస్కరించిన ప్రజా తీర్పుని గౌరవించాలని, దానికి వెన్నుపోటు దినోత్సవం నిర్వహించడం ఏంటని ఆయన నిలదీసినట్లు వైసీపీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం..
జగన్ పాలనా తీరు, ఆయన అవినీతి, అక్రమాలపై విసిగివేసారి పోయిన ధర్మాన… వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.. ఏదో ఒక పార్టీలో చేరడం లేదంటే ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్ అని యోచిస్తున్నారట ధర్మాన.. అందుకే, వైసీపీ కార్యక్రమాలకు ఆయన ఎడమొహం పెడమొహంగా ఉన్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.. మొత్తమ్మీద, జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. అందుకే, ధర్మాన లాంటి నేతలు తప్పుకుంటున్నారు.. ధర్మాన వైసీపీని వీడితే, శ్రీకాకుళంలో ఆ పార్టీకి అది భర్తీ చేయలేని నష్టం.. అంతటి అనుభవం కలిగిన నేతలని దక్కించుకోవడం కష్టం.. మరి, ధర్మానను జగన్ ఒప్పిస్తారా.?. లేక, జంప్ అవుతాడా..? అనేది త్వరలోనే తేలనుంది..











