ప్రపంచ రాజకీయ యవనిక పై సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు ఒకరు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ప్రజాసేవే పరమావధిగా స్థిత ప్రజ్ఞతో, ప్రత్యేక జీవన సరళిని అనుసరిస్తున్ననాయకుడు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆయన ధ్యాస. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మలుచుకొని దార్శనికత నేతగా ఎదిగిన చంద్రబాబు వ్యక్తిత్వం,ఆయన ఆదర్శ విధానాలు నేటి యువతకి స్పూర్తి దాయకం.ఆయనదొక విజన్,ఆయనొక పెర్ఫార్మర్,ఒక రిఫార్మర్.విశ్రాంతి అవసరం లేని,సమయం తెలియని నాయకుడు.కాళ్ళకి చక్రాలు,కాలానికి రెక్కలు తొడిగే అవిశ్రాంత పధికుడు.మోటివేటర్,యువతకు మార్గదర్శకుడు.అమృత లభించేవరకు పాల సముద్రాన్ని మధిస్తూ వెళ్లడమే కార్యసాధకుల లక్షణం.ఆ కోవకు చెందిన వారే చంద్రబాబు కూడా అని చెప్పాలి.రాజకీయంగా ఎవరు అంగీకరించినా,అంగీకరించక పోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పరిపాలనలో కానీ,విభజిత నవ్యాoద్ర ఐదేళ్ల పరిపాలనలో కానీ చంద్రబాబు కి ప్రత్యేక మైన స్థానం ఉంది. సుదీర్ఘ కాలం ప్రజల ఆధారాభిమానాలు చూరగొంటు మనగలిగిన నాయకుడు వర్తమాన రాజకీయ చరిత్రలో లేరు.ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్ధేశించుకొని కాలంతో పోటీ పడ్డారు ఆయన. విభజన అనంతరం నవ్యాoధ్రను అభివృద్ధి చెయ్యడానికి తనను,తాను రాష్ట్రానికి సమర్పించుకున్నారు. నవ్యాంద్రా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో శ్రేయోదాయక అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. సవాళ్లు ఎదురైనా,సమస్యలు చుట్టు ముట్టినా ఆయనలో ఆత్మ స్థైర్యం తలవంచలేదు. ఆంధ్రప్రదేశ్ ను శిధిలం నుండి శిఖరం వైపు నడిపించారు. మరో ఐదేళ్లు ఆయన అధికారంలో కొనసాగి ఉంటే అభివృద్ధి ఫలాలు ప్రజలకు దక్కేవి.నిరాశ చెందని తత్వం,అలసట ఎరుగని ధీరత్వం ఆయనది .జీతాలకు కూడా సరిపడా రాబడిలేని రాష్ట్రాన్నిసాకేందుకు ఆయన అనుసరించిన విధానాలు సత్పలితాలను ఇచ్చాయి.కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు.హోటల్లో సమావేశాలు, బస్సులో పడుకొని పరిపాలన సాగించారు. రాజధాని లేదు, ఆర్ధిక వనరులు లేవు, ప్రతిపక్షాల అడ్డంకులు, ప్రకృతి ప్రకోపాన్నిఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పోరాడి రాష్ట్రాన్ని వెలుగుబాట పట్టించారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు విభాగాల వారీగా స్పష్టమైన లక్ష్యాలు నిర్ధేశించుకొని, సంపద సృష్టించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా సమ్మిళిత,సుస్థిర అభివృద్దే లక్ష్యoగా పనిచేశారు. సామాజిక, ఆర్ధిక మానవాభివృద్ది సూచికల ప్రాతిపదికన 2029నాటికి భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో అభివృద్ది ప్రణాళికలు రచించారు. సమర్ధతను, పరిమిత వనరులను గరిష్ట ప్రయోజన దాయకంగా మలచుకొని ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగాన నిలబెట్టేందుకు అత్యున్నత లక్ష్యం నిర్దేశించుకొని ప్రతిక్షణం దాని సాధన కోసం పరిశ్రమించారు చంద్రబాబు.
ఒకప్పుడు ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని మించేటట్లు అభివృద్ధి చెయ్యాలని ప్రణాళికలు రూపొందించారు.మరోసారి ప్రజలు అధికారం ఇచ్చివున్నట్లు అయితే హైదరాబాద్ అభివృద్ధి చేసినట్లే అమరావతిని అద్భుతంగా నిర్మించేవారు.నేడు ఆంధ్రప్రదేశ్ తనను రక్షించమని చంద్రబాబును వేడుకొంటున్నది. సమర్ధ నాయకుడు,అనన్య పాలనా దక్షుడు కోసం తపిస్థోoది ఆంధ్రప్రదేశ్.అమరావతి నిర్మాణం పూర్తయితే ఐదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ఐదు కోట్ల ప్రజల తలరాతలు అపూర్వం అయ్యేవి.చంద్రబాబు పిలుపుకు స్పందించి నమ్మకమే పెట్టుబడిగా 29 గ్రామాల నుండి 28 వేల మంది రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఉచితంగా భూములు ఇవ్వడం గర్వకారణం. ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అయిదేళ్లలో 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ఆంద్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది.పేదరికం లేని సమాజాన్ని చూడాలని,పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన తపన,గ్రామాలే దేశానికి వెన్నెముక అన్నమహాత్మా గాంధీ స్ఫూర్తితో కుటుంబాన్నిఒక యూనిట్ గా తీసుకొని, కుటుంభ వికాసం, దాని నుండి సమాజ వికాసం తద్వారా రాష్ట్రసర్వతో ముఖ వికాసం కోసం నిర్విరామ కృషి చేసిన మహా నాయకుడు ఆయన.అన్నిటి కి మించి గొప్పమానవతామూర్తి.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే క్రమంలో జీవితంలో అన్నిదశలలో పుట్టుక నుండి చరమాంకంలో మహాప్రస్ధానం వరకు అన్ని విధాలుగా లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించారు .నిరుపేదలు, రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టి బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు చంద్రబాబు.ఆర్ధిక ఇబ్బందులలో వున్న రైతులను ఆదుకొనేందుకు రూ15,500 కోట్లు రుణ మాపి చెసారు,90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు అందించారు. రైతులకు వడ్డీ రాయితీ ఇచ్చారు. జల సంవరక్షణ,భూసార రక్షణ,చెరువుల పూడిక తీత,భూగర్భ జలాలు పెంపు తో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ధృఢ సంకల్పంతో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నాలుగున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.67 వేల కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న దృఢ సంకల్పంతోదశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన భారీ ప్రాజెక్టు పోలవరంను 70శాతం పూర్తిచేశారు. పట్టిసీమ పూర్తీ చేసి కృష్ణా,గోదావరి నదులు అనుసంధానం అనే ఆదర్సాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు.అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తయి ఉండేవి. అవి పూర్తి అయి వుంటే అయిదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ప్రజల తల రాతలు అపూర్వం అయ్యేవి.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారో లేదో అన్న సందేహాలు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను మొదటిస్థానంలో నిలిపారు చంద్రబాబు. ఆయన హయాంలో పారిశ్రామిక వికాసం వెల్లివిరిసింది.ఐదేళ్లలో కియా,హీరో,ఇసుజు,అశోక్ లేలాండ్,ప్లెక్సీ ట్రానిక్స్,జియోమీ,ఫాక్స్ క్యాన్,హెచ్ సి యల్,బ్రేక్స్ ఇండియా,ఏషియన్ పేయిట్స్,బెర్జర్ పెయింట్స్,చెట్టినాడ్ సిమెంట్,కల్యాణీ స్టీల్,బ్రిటానియా,పెప్సీ,సెల్ కాన్,కార్బన్ డిక్సన్,సెయింట్ గోబన్,గూగుల్ ఎక్స్, భారత్ ఫోర్జ్,అపోలో టైర్స్,ఇలా రాష్ట్ర్రానికి దెశ ,విదేశీ పరిశ్రమలు అనేకం రాష్ట్రానికి వచ్చాయి. ప్రపంచ ఆటో మొభైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆగమనంతో కరువుకు చిరునామా అయిన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతం రూపు రేఖలే మారి పొయ్యాయి.కియా వచ్చింది అనంత పురానికి కొత్త కళ వచ్చింది.ఆర్ధిక ఇబ్బందుల్లోనూ దేశంలో మరే రాష్ట్రం సాధించనంత వృద్దిరేటును ఆంధ్రప్రదేశ్ సాధించడం గర్వకారణం.ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విన్నూత్న విధానాలతో ఆదాయ వనరులు పెంచారు.ఆర్ధిక క్రమశిక్షణ పాటించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారు. కఠోర శ్రమ, సంస్కృతి, ఆయన నమ్మిన సిద్దాంతాలు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాoగాన్ని గౌరవిస్తూ పరిపాలన సాగించడమే ఆయన విధి. ఆయన శ్రమ అమేయం,ఆయన కృషి అనన్య సామాన్యం,ఆ జ్ఞానం అపారం, ఆయన పట్టుదల అపూర్వం,ఆయన మేధస్సు అమోఘం.ఆయన సహనం అనిర్వచనీయం.రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ,విభజన హామీలు అమలు పరచడం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు చంద్రబాబు. ప్రస్తుత పాలక పక్షం విద్వoసాలతో,విద్వేషంతో, ప్రతీకార దొరణితో ఎన్ని అవమానాలకు గురి చేస్తున్నా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా చంద్రబాబు ఎక్కడా,ఎప్పుడు ఆవేశానికి లోనూ కాకుండా చలించని ద్రుడత్వంతో సముద్ర మంత సహనాన్ని చూపిస్తున్నారు. ఆంధ్రాభ్యుదయం కోరి అవమానాలు భరిస్తూ అందరికోసం ఒక్కడై అహర్నిశలు చెమటోడుస్తున్ననాయకుడు . బలహీనతలతో తలవంచని,ఆత్మగౌరవం కోసం ఎదురొడ్డిన నాయకుడు. అను నిత్యం రాష్ట్రం కోసం, ప్రజల కోసం తపిస్తున్న నాయకుడు చంద్రబాబు. అందుకే గత మెంతో ఘనం అని ప్రజలు అర్ధం చేసుకొనే పరిస్తితులు నెలకొన్నాయి రాష్ట్రంలో. ఆ గతమంతా చంద్రబాబు, తెలుగుదేశం ప్రాభవమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆయన నమ్మిన సిద్దాంతాలు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాoగాన్ని గౌరవిస్తూ పరిపాలన సాగించడమే ఆయన విధి. ఆయన శ్రమ అమేయం,ఆయన కృషి అనన్య సామాన్యం,ఆ జ్ఞానం అపారం, ఆయన పట్టుదల అపూర్వం,ఆయన మేధస్సు అమోఘం.ఆయన సహనం అనిర్వచనీయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఐటి విప్లవాన్ని గుర్తించిన చంద్రబాబు ఐటి ఫలితాలు తెలుగుప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందు చూపుతో వ్యవహరించి ఐటి రంగం అభివృద్ధి పై దృష్టి పెట్టారు.ఐ టీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐ టి రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది..నాలెడ్జ్ఆ ఎకానమిని సృష్టించాలన్న లక్ష్యంతో అమెరికా వీధుల్లో 14 రోజులు స్వయంగా ఫైళ్లు చేతపట్టుకొని తిరిగారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఐటి రంగంలో అగ్రగామి నిలిపారు.బెంగుళూరు,ముంభై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదారాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం.ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీనీయంగా ప్రసిద్ది పొందారు. జంటనగరాలకు తోడు సైబరాబాద్ నిర్మించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపును తెచ్చారు. బిజినెస్ స్కూలు,ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు,రోడ్ల విస్తరణ,కొత్తరోడ్ల నిర్మాణం,గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లకు రూపకల్పన,వంటి అద్భుత కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్దిని పరుగులు పెట్టించారు.మహిళా శక్తిని ప్రభల ఆర్ధిక శక్తిగా మలచడంలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. స్వయం సహాయక సంఘాలను ఏర్పరచి స్వయం సమృద్ధి సాధించి మహిళా సాధికారత దిశగా నడిపించారు. ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యవరకు ప్రోత్సాహం అందించారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఎంతో మంది యువతీ,యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసారు.ఆనాడు దూరదృష్టి తో చంద్రబాబు నెలకొల్పిన బయోటెక్ పార్క్ నేడు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియలో భారత దేశాన్ని ముందు వరుసలో నిలిపింది.ఆయన పునాది వేసిన జీనోమ్ వ్యాలీ వైపు దేశమంతా చూసింది.హుద్ హుద్, తిత్లీ వంటి అనేక విపత్తుల సమయాల్లోనూ,కరువు కాటకాలు ఎదురైనా కార్యక్షేత్రంలో నేను వున్నానని ముందుండి ప్రభుత్వ యంత్రాoగాన్నికార్యోన్ముఖులు చేసి విపత్తులు ఎదుర్కొన్న ఘనత చంద్రబాబుదే. ఉత్తరాఖండ్ వరదల సమయంలో తెలుగు ప్రజలు అక్కడ చిక్కుకొంటే ప్రత్యేక విమానాలద్వారా స్వస్థలానికి చేర్చిన దయామయుడు చంద్రబాబు. అధికారం అనుభవించడం కోసం కాదని, ప్రజలకు సేవ చెయ్యడం కోసమని విశ్వసించే అరుదైన నాయకుడు. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంధి పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించాలని, పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నదే చంద్రబాబు ఆశయం. ఎస్సీ,ఎస్టీ,ల సంక్షేమానికి జస్టీస్ పున్నయ్య కమీషన్ ఏర్పాటు,బీసీలకు 33 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసిన నాయకుడు. ప్రజలే ముందు,ప్రజలే ముఖ్యం అని అధికారులకు చెప్పిన,పాలనలో నియమ నిబంధనలు గురించి చెప్పిపాలనలో మానవీయత మరవద్దని చెప్పిన ఆదర్శనాయకుడు చంద్రబాబు. ఆయన అంకిత భావం,కృషి,పట్టుదల, అమోఘం.ఆయన అనన్య పాలనా దక్షుడు.చీకట్లు కమ్మిన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులు నింపిన చంద్రుడు చంద్రబాబు.స్వర్ణాంధ్రా స్వాఫ్నికుడు,నిర్విరామ శ్రామికుడు ఆయన చంద్రబాబు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోంహించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు,ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన అశేష అభిమానులు తరపున చంద్రబాబు గార్కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.