అమరావతి పరిరక్షణకై రాయపూడిలో ‘జనభేరి’ పేరిట రాయపూడి నిర్వహిస్తున్న సభ హాజరవడానికి వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ని వెలగపూడి వద్ద పోలీసుల అడ్డుకున్నారు. కాన్వాయ్ని అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సభకు అనుమతులు ఉన్నా కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వేరే దారిలో వెళ్లడానికి నిర్ణయించుకున్న చంద్రబాబు. కానీ భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయంటూ దానికి కూడా పోలీసులు అడ్డుపడుతున్నారు.
ఇప్పటికే టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ పేరుతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సభకు అనుమతి ఉన్నా కూడా వారిని సభ ప్రాంగనానికి చేరుకోకుండా చేయాలనే ఉద్దేశంతో గొడవలను సాకుగా చూపి పోలీసులు అరెస్టుల పర్యం తెర లేపారు. రైతుల ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణచివేయాలని ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
Must Read ;- నలుదిక్కుల ప్రతిధ్వనించనున్న రాజధాని జనభేరి!
Also Read ;- అశోక్ గజపతికి అవమానం జరిగితే నాకూ జరిగినట్టే : చంద్రబాబు











