May 13, 2026 4:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లోకేష్ వేసే ప్రతి అడుగు ప్రజా ఫీడన విముక్తికి అంకుశం

April 21, 2023 at 11:28 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర తెలుగుదేశానికి వెలుగు కిరణం.కాలంలోనూ,దూరంలోనూ అపూర్వ రీతిలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చరిత్ర లోకేష్ ది. పార్టీ బలోపేతానికి తనకర్తవ్యాన్ని తన భుజస్కoదాల మీద వేసుకొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొంటున్నారు.పాదయాత్రకు జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా,ఎన్ని కేసులు పెట్టినా లోకేష్ అదరలేదు,బెదరలేదు.కార్యసాధకుడికి కష్టం ఒక అవకాశం.లోకేష్ వేస్తున్న ప్రతి అడుగు ప్రజాఫీడన విముక్తికి అంకుశం కాగలదు. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అన్ని వర్గాల నుండి అపూర్వ ఆదరణ లభిస్తుంది.తనను కలిసేందుకు వస్తున్న ప్రజలకు అత్యంత సన్నిహితంగా కలిసి నడవడం,ఆప్యాయంగా పలకరించడం,వారి సమస్యలు వినడం అధికారంలోకి రాగానే పరిష్కారం చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. అట్లాగే ఏది మంచి,ఏది చెడు అనే అంశాలను ప్రజలకు వివరించి వారిని ఆలోచింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ అనేక విషయాల పై అవగాహనతో మాట్లాడుతున్నారు.జనం మధ్య ఆత్మీయంగా మెలుగుతూ తనను తాను ప్రజానాయకుడిగా నిరూపించుకోన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్దతను,అవినీతిని కడిగి పారేస్తున్నారు. కొత్తగా రాజకేయాల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఎవరికైనా తడబాటు సహజం.కానీ నేడు లోకేష్ ఒక పరిపక్వత కలిగి, కష్టాన్ని ఓర్చుకో గలిగిన శక్తీ వంతమైన నాయకుడిగా, తనను తాను కార్యసాధకుడిగా నిరూపించుకొన్నారు పాదయాత్ర ద్వారా. లోకేష్ ను వైసిపి నాయకులు అనేకమైన వెక్కిరింతలతో హేళన చేశారు. పప్పు వంటి పదాలతో గేలి చేశారు.ఆయన వ్యక్తిత్వాన్ని,సమర్ధతని దెబ్బతీయ్యడానికి సామాజిక మాధ్యమాలలోనూ సకల ప్రయత్నాలు చేశారు.నేడు లోకేష్ అనేక అంశాలపై అవగాహనతో ఆచరణాత్మకంగా మాట్లాతుండటంతో నాడు విమర్శించిన వారంతా నేడు లోకేష్ సమర్దతను,పరిపక్వతను చూసి నోరెళ్ళ బెడుతున్నారు. జనంతో సంబంధం పెట్టుకోవడం ద్వారా రాజకీయ, సామాజిక లక్ష్యాలు నిర్ధేశించుకొని చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారెవరూ రాజకీయాల్లో విఫలం కాలేదు.జనంతో అత్యంత సన్నిహితంగా మెలిగే పాదయాత్ర లోకేష్ చెపట్టడంతో ఇప్పటికే ప్రతిష్ఠ దిగజారిన అధికారపక్షానికి తమకున్న జనామోదం మరింత క్షీణిస్తుందన్న కలవరం మొదలు అయింది. లోకేష్ పాదయాత్ర అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.రానున్న సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి లోకేష్ ప్రభంజనం మరింత పెరిగితే తమ పరిస్థితి ఏమిటని వైసిపి నాయకుల గుండెల్లో గుబులు మొదలయింది.

పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు,పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపెందుకు యువగళం పాదయాత్ర ఎంతో దోహదం చేస్తుంది. పాదయాత్రకు పల్లెలు కదులు తున్నాయి. పట్టణాలు తరలుతున్నాయి. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు,అవినీతి,అసమర్ధత, వ్యవ సాయ సంక్షోభం,రైతు ఆత్మహత్యలు,పెంచిన విద్యుత్తు చార్జీలు,పడకేసిన పారిశ్రామిక రంగం,పెరిగిన నిత్యావసర ధరలు,రాష్ట్రంలో ఏ విధంగా ప్రజా సంపద దోపిడీ చేస్తున్న విధానాన్ని ప్రజల కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు లోకేష్ . తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనను ,వైసిపి పరిపాలన కంపేరు చేస్తూ ప్రజలను ఆలోచించమని ప్రజలను కోరుతున్నారు.నాలుగేళ్లుగా ప్రజల భాధలు వర్ణనాతీతం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు అదుపులేదు. పన్నులు భారంతో పేదలు సామాన్యులు,మధ్యతరగతి వారు బతక లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్రలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,కూలీలు,కమ్మరి,కుమ్మ రి ,కంసాలి వంటి చేతి వృత్తులు వారిని బీసీలను,రైతులను,మహిళలను ,విద్యార్థులు,నిరుద్యోగులు,వీరందరి సమస్యల పరిష్కారానికి,స్వావలంభనకు వివిధ వర్గాల అభ్యున్నతి కోసం,రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. పాదయాత్ర ద్వారా ఆయన జనంలోకి వెళ్లడంతో వైసిపి నాయకులు వణికి పోతున్నారంటే,తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత సానుకూల పరిస్థితి ఉన్నదో అర్ధం అవుతున్నది.దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకులు అందరి పై వుంది. తెలుగుదేశం పార్టీ నిరంతరాయంగా కొనసాగుతుందన్నభరోసాగా యువగళం పాదయాత్ర అనేక ప్రతికూల అంశాలకు విరుగుడుగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. పాదయాత్రలో ప్రభుత్వానికి లోకేష్ విసురుతున్న సవాళ్లకు,సెల్ఫీ ఛాలెంజ్ లకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్ ను ప్రభుత్వం సవీకరించలేకపోయింది . అంతేకాదు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమలు వద్ద లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లకు కూడా ప్రభుత్వం నుండి సమాధానం లేదు.

యువగళం పాదయాత్ర సాగనీకుండా అధికార పార్టీ వైసిపి అడుగడుగునా అడ్డంకులు కల్పించినా, ఒక సెక్షన్ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగనా అడ్డుకోవాలని చూసినా, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బిసి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలంతా సంఘటితమై యువగళం పాదయాత్రకు రక్షణ గానిలిచి ముందుకు నడిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర రోజు,రోజుకు జన సముద్రంగా మారుతుంది . జనవరి 27 న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యువగళం పాద యాత్ర 74 రోజులు అవుతుంది.1000 కిలోమీటర్లు పూర్తీ కావస్తుంది. పాదయాత్రలోయువత మొదటి నుంచి కదం తొక్కుతోంది. యువతకే ఈ యాత్ర పరిమితం కాకుండా, రైతులు, మహిళలు, కార్మికులు, బిసి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అన్నివర్గాల ప్రజానీకం ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఉదయాన్నే యాత్ర ఆరంభంలో అందరితో సెల్ఫీలు ఒక ఉత్ప్రేరకమైతే, యువగళంలో లోకేశ్ తో గొంతు కలిపేందుకు, ఆయన అడుగుల్లో అడుగేసేందుకు ఆయా వర్గాల ఉత్సాహం ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప వర్ణించ జాలము. కాళ్లకు బొబ్బలెక్కినా ,మండు టెండలోను లోకేశ్ స్పీడ్ అందుకునేందుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పరుగులు తీయాల్సిన పరిస్థితి. కేసులు పెట్టినా, సభలు జరగకుండా అడ్డుకున్నా, చివరికి ఎత్తు స్టూల్ కూడా లాక్కుని, ప్రజలను కలవనీయకుండా, వారిని పలకరించనీయ కుండా, ప్రసంగించనీయ కుండా అడ్డుకున్నా మొక్కవోని ధైర్యంతో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నారా లోకేశ్ యువగళం యాత్రను ముందుకు నడిపిస్తున్నారు.అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని, పాదయాత్ర తన హక్కంటూ, సమావేశమయ్యే హక్కు బాబాసాహెబ్ తనకిచ్చారని చెబుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను అనర్గళంగా వల్లెవేస్తూ ముందుకు దూసుకుపోతున్న లోకేశ్ ను చూసి అడ్డుకోవాలని చూసినవాళ్లే ముక్కున వేలేసుకుని విస్తుపోయేలా చేస్తోంది.

పాదయాత్రలో ప్రతిరోజూ ఎక్కడికక్కడ రైతులతో భేటీలు, వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకోవడం, పరిష్కారాల అన్వేషణ, మేనిఫెస్టోలో వాటినెలా పొందు పర్చాలో సూచనలు చేస్తూ రైతాంగంలో భరోసా పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు లోకేష్. చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్డెరలు, బీసీ వర్గాలన్నింటితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ చేతివృత్తులన్నింటినీ ప్రస్తుత వైసిపి ప్రభుత్వమెలా నిర్వీర్యం చేసిందో తెలియజేస్తూ, గతంలో టిడిపి తెచ్చిన స్కీములు ఎలా రద్దు చేశారో వివరిస్తూ, మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తే వారికి చేసే మేళ్లని వివరిస్తున్నారు. బీసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామంటూ భవిష్యత్ పై విశ్వాసం పెంచడం విశేషం. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలపై వైసిపి దమన కాండ పై ధ్వజమెత్తుతున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్యాక్రాంతమైన భూములన్నీ తిరిగి ఇప్పిస్తామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతామని, అక్రమ కేసులు ఎత్తేస్తామని హామీలిస్తూ వారిలో నమ్మకం కలిగిస్తున్నారు. అసైన్డ్ భూములు, ఆర్మీ భూములు, దేవాదాయ భూములన్నింటినీ విడిపిస్తామని, విలువై ప్రభుత్వభూములను కాపాడతామని , ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ముందుకెళ్తున్నారు. వైసిపి శాండ్-ల్యాండ్ మాఫియా, వైన్-మైన్ మాఫియా భరతం పడతామని లోకేశ్ హెచ్చరికలు అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. రాష్ట్రాన్నిగంజాయాంధ్రప్రదేశ్ గా మార్చారని, తిరుమల తిరుపతిలో కూడా గంజాయి సరఫరా,విక్రయాలపై ప్రజలకు వివరిస్తున్నారు.నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో వైసిపి ప్రభుత్వ చెలగాటమారుతుందని. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడే వైసిపి గుండాల అంతు చూస్తాననే వార్నింగులతో ఆడబిడ్డలకు అభయం ఇస్తున్నారు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు అయితే, విధ్వంసానికి బ్రాండ్ జగన్ రెడ్డని, లోకేశ్ చేస్తున్న ప్రసంగాలు అన్నివర్గాల ప్రజలను ఆలోచింప చేసేవిగా వున్నాయి .నారా లోకేష్ ఏ గ్రామం,ఏ మండలంవెళ్లినా, ఏ పట్టణం వెళ్లినా ఏ కూడలిలో ప్రసంగిస్తున్నాజనంలో నూతనోత్సాహం ఉరకలు వేస్తుంది.లోకేష్ యువగళం ప్రజల్లోతమ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది. 400 రోజులు, 4వేల కిమీ యాత్ర లక్ష్యానికి చేరువయ్యేందుకు రాకెట్ స్పీడ్ తో యువగళం సవాళ్ల మధ్య సవారీ చేస్తుంది .ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయనే విశ్వాసం యువగళం పాదయాత్ర కల్పిస్తుంది.తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేoదుకు మండుటెండలో కాళ్ళు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా పాదయాత్ర చేసి లోకేష్ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు ప్రజాఫీడన విముక్తికి అంకుశం కాగలదు.

Tags: #topstoriesap elections 2024ap newschandrababueditor's pickEditorspickLatest Newsnara lokeshnara lokesh padayatratdptdp vs ysrptop storiesys jaganysrcpyuvagalam padayatra
Previous Post

స్వర్ణాంధ్రా స్వాఫ్నికుడు-నిర్విరామ శ్రామికుడు

Next Post

నిర్బంధాల నడుమ లోకేశ్ యువగళం పాదయాత్ర 1000కిమీ పూర్తి..

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ఏపీలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు తప్పని సరి కానుందా?

గేటు తెరవాలంటేనే భయం.. భయం.. ఇప్పట్లో బొమ్మపడదు

కేసీఆర్ డైరెక్ష‌న్‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు!

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist