January 19, 2021 11:14 PM
26 °c
Hyderabad
22 ° Tue
24 ° Wed
24 ° Thu
24 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బీహార్ లో పెద్దన్న నితీష్ పై  ‘చిన్నచూపు’ చీలిక

బీహార్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఆర్జేడీ కొత్త ఆఫర్ ఇస్తోంది. వారితో చేయి కలిపితే ఏకంగా ప్రధానిని చేస్తాం అంటోంది.

December 31, 2020 at 9:20 AM
Chief Minister Nitish Kumar
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బీహార్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  అధికార జేడీయూ నుంచి 17మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని ఆర్జేడీ నేత చేసిన ప్రకటనే ఇందుకు కారణం. ఈ ప్రకటన కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అనుకోవడానికి లేదు. ఇప్పటికే బీహార్ లో జేడీయూతో పరిస్థితులు మారాయి. పార్టీ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ తప్పుకోవడం, బీహార్ లో మిత్ర పక్షంగా ఉంటూనే.. అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవడం, తనకు సీఎం పదవిపై పెద్దగా ఆసక్తి లేదని నితీష్ కుమార్ ప్రకటించడం.. ఇలా వారం రోజుల వ్యవధిలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ ఇప్పటికే ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 17మంది అధికార జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

గత నవంబరులో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆర్జేడీ, బీజేపీ, జేడీయూ లకు ఎక్కువ సీట్లు వచ్చాయి. మహాఘట్ బంధన్ (మహా కూటమి)లో ఆర్జేడీ, కాంగ్రెస్ పక్షాలున్నాయి. 243 స్థానాల్లో 122 మేజిక్ ఫిగర్. కాగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఆర్జేడీ 76 సీట్లతో అత్యధిక స్థానాలు పొందింది. తర్వాత బీజేపీ 73 సీట్లు సాధించింది. జేడీయూ తక్కువగా 43 సీట్లు పొందింది.  జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా బీజేపీ మద్దతు ఇచ్చి నితీష్ ను ముఖ్యమంత్రిని చేసింది. ప్రస్తుతం జేడీయూ, నితీష్ కూటమికి 125 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ లకు 110 సీట్లు ఉన్నాయి. అప్పటివరకు బాగానే ఉన్నా.. తరువాతే అసలు చిరాకు మొదలైంది.

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక నెలరోజుల సమయంలో బీహార్ లో తీసుకుంటున్న నిర్ణయాల్లో బీజేపీ పూర్తిగా జోక్యం చేసుకోవడంతో నితీష్ ఇప్పటికే అసహనంగా ఉన్నారు. అది చాలదన్నట్లు.. రెండురోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లో అవసరం లేకపోయినా ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకోవడంపై నితీష్ ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జేడీయూ అధ్యక్ష బాధ్యతలనుంచి నితీష్ తప్పుకున్నారు. తన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ఆర్‌సీపీ సింగ్‌కు జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు నితీష్. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే నితీష్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి అవసరం లేదని, బీజేపీ ఒత్తిడితోనే తాను బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనూ, బీజేపీలోనూ కలకలం రేపాయి. ఇక బీజేపీ తన పార్టీని చిన్నచూపు చూస్తోందని ఇప్పటికే జేడీయూ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి.

ఫిరాయింపులు కాదు.. విలీనాలేనా..

జేడీయూకి చెందిన 17 ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) పార్టీలో చేరనున్నట్లు ఆర్జేడీ నేత  శ్యామ్ రజక్ అన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్యామ్ రజాక్ ఇటీవలే రాజీనామా చేశారు. ఆ సమయంలోనూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ పై చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగానే ఉన్నారని అప్పట్లోనే వ్యాఖ్యానించారు. తాజాగా  జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నారని, తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోరని, అందుకోసం 28 మంది ఎమ్మెల్యేలు కలసి ఆర్జేడీలో చేరుతారని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆర్జేడీ తాజాగా మరో ప్రతిపాదనను నితీష్ ముందు ఉంచింది. బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, క్రమేణా జేడీయూని నిర్వీర్యం చేస్తుందని ఆ పార్టీ కీలక నేత ఉదయ్ నారాయణ చౌదరి వ్యాఖ్యానించారు. నితీష్ ను గతంలో ఆర్జేడీ పార్టీ సీఎంని చేసిందని, నితీష్ ఇప్పుడు అది గుర్తుచేసుకోవాలని వ్యాఖ్యానించారు. నితీష్ మహాఘట్ బంధన్ లో చేరాలని, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ కు సీఎం బాధ్యతలు అప్పగించాలని, అందుకుగాను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి, ఆయనను పీఎం చేయడానికి ఆర్జేడీ పోరాడుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం నితీష్ కుమార్ కొట్టి పారేశారు. ఆర్జేడీ చేస్తున్న వాదనలు నిరాధారమని, తమ పార్టీని ఎవరూ వీడడం లేదని వ్యాఖ్యానించారు.

ఇక్కడే మరో విషయం కూడా ఉంది. రాజకీయంగా నితీష్ కుమార్ చాణక్యుడిగా పేరున్నా.. భాగస్వామ్య పార్టీల బెదిరింపులకు లొంగరనే విషయం 2017లోనే బీజేపీకి అర్థమైంది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వేర్వేరుగా పోటీచేసినా.. ఫలితాల తరువాత ఆ రెండుపార్టీలు కలిశాయి. ఆర్జేడీ మద్దతుతో నితీష్ సీఎం అయ్యారు. అయితే తరువాత రెండేళ్లకు 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీతో భేదాభిప్రాయాలు రావడంతో రాజీనామా చేసిన నితీష్ కు వెంటనే 53 సీట్లు ఉన్న బీజేపీ మద్దతు లభించింది. దీంతో మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు నితీష్ కుమార్. అప్పటినుంచి బీజేపీతో కొనసాగుతున్నారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే లో భాగస్వాములుగా ఉన్న బీజేపీ 110చోట్ల పోటీ చేయగా, జేడీయూ 115 చోట్ల పోటీ చేసింది.

Tags: biharbjpChief Minister Nitish KumarjduLatest NewsLatest Telugu Newsnitish kumarPatnarjdShyam Rajaktelugu news
Previous Post

2020 రివ్యూ : తెలంగాణ రంగు మారిన రాజకీయం

Next Post

నవరసాలను శాసించిన కంచుకంఠం( జగ్గయ్య జన్మదిన ప్రత్యేకం) 

Related Posts

Editors Pick
అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

by లియో డెస్క్
January 19, 2021 6:12 pm

అర్నాబ్ గోస్వామి.. టీఆర్‌పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జైలుకి వెళ్లి...

Editors Pick
తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

by లియో డెస్క్
January 19, 2021 2:59 pm

తమిళనాడు, పుదుశ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళలో వచ్చే ఏప్రిల్ ,...

Latest News
ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నరేంద్రమోడీ

ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నరేంద్రమోడీ

by లియో రిపోర్టర్
January 19, 2021 8:18 am

ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్‌ దేవాలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ...

Andhra Pradesh
వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

by లియో డెస్క్
January 19, 2021 6:30 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో...

Andhra Pradesh
బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

by లియో రిపోర్టర్
January 18, 2021 11:38 am

హఫీజ్ పేట భూవివాదం నేపథ్యంలో..బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో...

Latest News
రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

by లియో డెస్క్
January 18, 2021 7:00 am

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రెండు రోజుల్లో రూ.వందకోట్ల విరాళాలు వచ్చినట్టు సమాచారం ఉందని...

Editors Pick
భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది

భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది

by లియో డెస్క్
January 17, 2021 7:43 pm

అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేయ‌బోతున్న జో బైడెన్ టీంలో 20 మంది భారతీయ...

Editors Pick
పీఎం కేర్స్ ఫండ్ ‘ప్రైవేటు’దా.. వంద మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ

పీఎం కేర్స్ ఫండ్ ‘ప్రైవేటు’దా.. వంద మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ

by లియో డెస్క్
January 17, 2021 4:00 pm

కొవిడ్ సమయంలో పేదలను ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ నిధుల...

General
క్రికెట్ ప్రపంచంలోకి భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్!

క్రికెట్ ప్రపంచంలోకి భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్!

by chamundi G
January 17, 2021 1:48 pm

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ తో ‘త్రీడీ’ సినిమా చూపించేస్తాడు! మహేంద్రసింగ్...

Andhra Pradesh
అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

by లియో డెస్క్
January 17, 2021 11:23 am

అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేత జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

మాటల యుద్ధం ముదిరి రోడ్డున పడింది!

రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

సీఎం హస్తిన టూర్ సంజాయిషీ ఇచ్చుకునేందుకేనా?

వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నరేంద్రమోడీ

భారత్‌ సంచలనం… ఆసీస్ పై చరిత్రాత్మక విజయం

అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

ముఖ్య కథనాలు

వారెవ్వా.. చిన్న నిర్ణయం.. పెద్ద సంకేతం!

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?

ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

క్లైమాక్స్ చిత్రీకరణలో రాజమౌళి ట్రిపుల్ ఆర్

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

టీపీసీసీ రాజ్‌భవన్ ముట్టడి.. ఉద్రిక్తత

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

సినిమా

పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?

ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

పల్లెటూరి బుల్లోడుగా సూర్య 

క్లైమాక్స్ చిత్రీకరణలో రాజమౌళి ట్రిపుల్ ఆర్

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

నిన్న స్టైలిష్ స్టార్ – నేడు  మెగాస్టార్, మెగా పవర్ స్టార్

పూరి అసలు ప్లాన్ ఇదే .. !

మెగా ప్రిన్స్ .. హ్యాపీ బర్త్ డే

‘ఎఫ్ 3’లో మరో మెగా హీరో?  

బన్నీ స్టైల్ కి తాను ఫ్యాన్ అంటోన్న బాలీవుడ్ యంగ్ హీరో

జనరల్

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

చైనాకు ఉడాయించిన లోన్ యాప్స్ కంపెనీల డైరక్టర్లు

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist