ఏపీ శాసనమండలి వైసీపీ శాసన మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మూడు రాజధానుల అంశంపై ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.. అమరావతి అంశంపై శాసనమండలిలో బొత్స మాట్లాడారు.. అమరావతిని గతంలో తమ పార్టీ నేతలు స్మశానంతో పోల్చామని, నాటి పరిస్థితుల కారణంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు బొత్స.
మూడు రాజధానిలనేది ఆ రోజుకు మా విధానమని, రాజధానిపై ఇప్పుడు మా విధానం ఏమిటనేది పార్టీలో చర్చించి చెబుతామని శాసనమండలి సాక్షిగా ప్రకటించారు ఎమ్ఎల్సీ బొత్స.. నాడు తమ పార్టీ విధానపరమైన నిర్ణయం వలన అమరావతి స్మశానం లా ఉందని తాను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనని అంగీకరించారు బొత్స.. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడానని తెలిపారు.. అమరావతి వల్లకాడులా మారింది, అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలు నిజమే అని ఒప్పుకున్నారు వైసీపీ నేత..
బొత్స ఇంత సడెన్గా ఎందుకు యూ టర్న్ తీసుకున్నారనేది ఏపీ రాజకీయాలోల చర్చనీయాంశంగా మారింది.. గత ఎన్నికలలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర.. మూడు ప్రాంతాలలోనూ వైసీపీ దారుణంగా ఓటమి చెందింది.. ఈ ప్రభావంతో వైసీపీ మూడు రాజధానులకి చెల్లు చీటీ ఇచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.. మూడు ముక్కలాట తమను డ్యామేజ్ చేసిందని, పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చిందని తాడేపల్లి ప్యాలెస్ ఓ నిర్ణయానికి వచ్చింది.. ఈ వాదనే తాజాగా బొత్స నోట ఫీలర్లా వదిలారని, మూడు రాజధానులు తమ పార్టీ గత విధానమని, ప్రస్తుతం తమ నిర్ణయం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతామన్నారు..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పట్టాలెక్కింది.. శరవేగంగా పనులు మొదలవబోతున్నాయి.. ఎమ్ఎల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే దూకుడు పెరగనుంది.. రెండేళ్లలోనే అమరావతికి రూపురేఖలు సంతరించుకోనున్నాయి.. దీంతో, వైసీపీలో అంతర్మధనం మొదలయింది.. ఏపీ రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వస్తే వైసీపీ ఉనికి ప్రశ్నార్ధకం కానుందనేది వాస్తవం. అందుకే, ఎన్నికల ప్రక్రియ ముగిసిన పది నెలలలోనే ఆ పార్టీ వెనక్కి తగ్గిందనే వాదన వినిపిస్తోంది.. కనీసం డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పటినుండే ఓ ఫీలర్ని పంపాలని నిర్ణయించిందట తాడేపల్లి ప్యాలెస్.. మరి, ఇది కేవలం బొత్స వ్యక్తిగత అభిప్రాయమా…?? లేక పార్టీ లైన్ అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది.











