తెలంగాణ సీఎం ట్రాన్స్ జెండర్ అయ్యారంటూ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి మొగుడిని అవుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారంటూ హైదరాబాద్ లో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఢిల్లీలో మోడీ కాళ్లుపట్టుకుని వచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శిఖండిలా తయారయ్యారని దుయ్యబట్టారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే టీఆర్ ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనియ్యమని ఆయన హెచ్చరించారు.
రైతుబంధు పథకం పచ్చి మోసమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని ఆయన విమర్శించారు. సోనియాగాంధీ ఏ దేశంలో పుడితే ఏంటి, ఆమెకు పేదల కష్టాలు, బాధలు తెలుసని జీవన్ రెడ్డి ప్రశంసించారు. చివరకు శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిన ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్నారని గుర్తుచేశారు. నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణను స్థంభింపజేసిన కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడని విమర్శించారు. రైతులకు మద్దతు ధర దక్కకుంటే తెరాస దుకాణం బంద్ కావడం ఖాయమని జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Must Read ;- టీపీసీసీ సారథి రేవంత్ కాదు, జీవన్ రెడ్డి!











