తమిళంలో అజిత్, శృతిహాసన్ నటించిన ‘వేదాళం’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి మోజు పడిన విషయం తెలిసిందే. ‘వేదాళం’ సినిమాని డైరెక్ట్ చేసే బాధ్యతను దర్శకుడు మెహెర్ రమేష్ కి అప్పగించారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘వేదాళం’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మే నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా అత్యధిక భాగం షూటింగ్ కలకత్తాలో చేయడానికి ప్లాన్ చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమా కూడా కలకత్తాలోనే తీశారు. ఆ సెంటిమెంట్ కూడా ఇప్పుడు కలకత్తాలో ప్లాన్ చేయడానికి కారణం. అన్నా చెలెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. చిరంజీవి సిస్టర్ పాత్రని కీర్తి సురేష్ పోషించబోతోంది. మహతి సాగర్ మ్యూజిక్ డైరెక్షన్ లో ప్రస్తుతం పాటల కంపోసింగ్ జరిగుతోంది.