కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఎంసిర్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతో యూనిట్ 1,2,3,4,5 లలో ఉత్పత్తి ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా ఐదు యూనిట్లలో మొత్తం 1050 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్ 6 లో(600 మెగా వాట్స్) విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
చేతులు ఎత్తేసిన అవినాష్ రెడ్డి..?? సునీత, షర్మిల విజయం..!!
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది...