వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు పడిగాపులు కాస్తున్నాడు. తన గోడు చెప్పుకోవడానికి ఒక్కసారి జగన్మోహన్రెడ్డి దర్శన భాగ్యం కల్పించమని వేడుకున్నా.. కనికరించే వాళ్లే కనిపించడం లేదు. సాక్షి మీడియాకి చెప్పుకొందామంటే.. బోరుగడ్డ పేరు కూడా వినపడటానికి వీల్లేదని సజ్జల ఆదేశాలు ఇచ్చారని బోరుమంటున్నాడు.
ప్యాలెస్ పెద్దలు అధికార గర్వంతో ప్రత్యర్ధుల మీదకు ఉస్కో అనగానే.. పిచ్చి పట్టినట్టు నోటికొట్టిన బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ.. ఇప్పుడు ఫ్యామిలీతో సహా రోడ్డు మీదకు వచ్చేశానని మొత్తుకొంటున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు నిరసన దీక్ష చేపట్టినా.. పట్టించుకొనే వాళ్లే లేకుండా పోయారు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన సంగతి ఒకటుంది. బోరుగడ్డ నిరసన చేస్తున్న ప్రాంతంలోనే.. ప్రతి కార్యకర్త కష్టాన్నీ నేను మర్చిపోను అనే స్లోగన్తో జగన్ పోస్టర్లు ఉన్నాయి. కార్యకర్త కష్టాన్నీ కాదు ఏకంగా కార్యకర్తనే మర్చిపోయారని చెప్పడానికి బోరుగడ్డ ప్రత్యక్ష ఉదాహరణ నిలుస్తున్నాడు.
వైసీపీ ఓటమి తర్వాత ప్యాలెస్ పెద్దలు బోరుగడ్డతో తెగతెంపులు చేసుకున్నారు. అతనితో మాకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు. జగన్ అండ్ కో వదిలేసినా.. గతంలో చేసిన పాపాలు మాత్రం బోరుగడ్డను వదల్లేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గురించి చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలతో పాటు.. భూ కబ్జాలు, హత్య కేసుల్లో చట్టానికి దొరికిపోయాడు.
రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది అనుకొంటే.. సీదిరి అప్పలరాజు, విరూపాక్షిలా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే వారు. కానీ బోరుగడ్డతో పొలిటికల్గా నష్టమే తప్ప లాభం లేదనే క్లారిటీ రావడంతో.. అతన్ని టిష్యూ పేపర్లా పక్కకు విసిరేశారు. అప్పుడు బోరుగడ్డ ఏ రేంజ్లో రెచ్చిపోయాడు.. ఇప్పుడు మరి కొంత మంది కొత్త బిచ్చగాళ్లు.. పొద్దురగకుండా బూతు పారాయణం చేస్తున్నారు. భవిష్యత్తులో వారికీ బోరుగడ్డ గతి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ లేటెస్ట్ బూతు బ్యాచ్.. బోరుగడ్డను చూసిన తర్వాతైనా బుద్ది తెచ్చుకోపోతే.. నిరసన దీక్షలు కాదు కదా.. ప్యాలెస్ ముందు పొర్లు దండాలు పెట్టినా.. బిగ్బాస్ కన్నెత్తి కూడా చూడరని స్పష్టం చేస్తున్నారు.











