ఎమ్మెల్యేల తీరుపై ద్వితీయ శ్రేణి నాయకత్వం పెదవి విరుపు..!
అధికారపార్టీ ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ కేడర్ తీవ్ర అంసతృప్తితో ఉంది. ద్వితీయ శ్రేణితో సమన్వయం లేకుండా ఎమ్మెల్యేలు నడుచుకుంటున్న తీరు అధికార వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేల నీతిమాలిన ప్రవర్తనకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వంలో నైరాశ్య ఛాయలు అలుముకున్నాయి. దీంతో మొన్న గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చర్యలకు విసిగిన కీలక నేత ఉమామహేశ్వరరావు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. తాజా కర్నూలు జిల్లాలో బనగానపల్లె నియోజవర్గంలోని బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందని ప్రముఖ పారిశ్రామివేత్త, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాల పర్వం కొనసాగుతునే ఉంది!
ఎమ్మెల్యేలపై తిరుగుబాటు బావుట..!
ఏపీలో అధికార వైసీపీ కేడర్ లో అసంతృప్తి జ్వలలు రోజురోజుకు తీవ్ర తరమవుతూనే ఉన్నాయి. అధినాయకుడు జగన్ పర్యవేక్షణ లోపం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సమన్వయ లోపం కారణంగా ఓ రేంజ్లో కేడర్లో నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. దీంతో పార్టీ అధికారంలో ఇంకా రెండు సంవత్సరాలు ఉంది అని కూడా కౌంట్ చేయకుండా.. విలువ లేని చోట పదవులు అక్కర్లేదని రాజీనామా చేసి, పార్టీకి దూరమౌతున్నారు వైసీపీ కీలక నేతలు. మొన్న చిత్తూరు జిల్లా నగరి లో ఎమ్మెల్యేలు రోజా, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు పై ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం రోడ్డెక్కి మరి నిరసన తెలుపుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చర్యలకు కూడా కొంతమంది విసిగి రాజీనామా వైపు అడుగులు వేయాలని చూస్తున్నారు. కారణాలు ఏమైతేనేం.. కర్నూలు జిల్లా రాష్ట్రస్థాయి నాయకుడు గుండం శేషిరెడ్డి రాజీనామా చేశారు. ఇలా ఉత్తరాంధ్ర, కొస్తా, రాయలసీమల్లో వైసీపీ ఫ్యాన్ కు రివర్స్ గాలి వీస్తోంది!











