టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్కి ఝలక్ ఇచ్చిందా?? ఆయన ఆశలపై ఆమె నీళ్లు చల్లారా?? ఉభయ గోదావరి జిల్లాలలో కాపు కమ్మ ఈక్వేషన్కి చెక్ పెట్టాలంటే క్షత్రియ ఓటు బ్యాంక్ ముఖ్యమని భావించారు జగన్.. అందుకే, టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని ముందే ఊహించని జగన్… ఉభయ గోదావరి జిల్లాలలో ఎంతో కీలకమైన వర్మ సామాజిక వర్గాన్ని చేరువ చేసుకోవాలని లెక్కలు కట్టుకున్నారు వైసీపీ అధినేత. అందుకే, ప్రభాస్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ దక్కనుందని గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా లీకులు ఇస్తోంది.. జగన్ అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయని ఏపీ బీజేపీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం..
ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలను బీజేపీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.. కృష్ణంరాజు ఫ్యామిలీకి కాషాయదళంలో మంచి అనుబంధం ఉంది.. ఆయన రాజకీయ జీవితం బీజేపీ నుండే ప్రారంభం అయింది.. గతంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.. ఆ అనుబంధంతోనే మరోసారి ప్రభాస్ ఫ్యామిలీని యాక్టివ్ చేయాలని భావిస్తున్నారట ఆ పార్టీ నేతలు.. టీడీపీ – జనసేనతో పొత్తు కుదరడంతో ఆమె గెలుపు నల్లేరుపై నడకలా మారుతుందని లెక్కలు వేస్తున్నారట..
ఇదే అంశాన్ని ప్రభాస్ దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం.. ప్రస్తుతానికి రెబల్ స్టార్ సైలెంట్గా ఉన్నా.. పొత్తు ఫైనలైజ్ అయి సీట్ల వరకు లెక్కలు తేలితే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఆ ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుండి అందుతోన్న సమాచారం. బాహుబలితో ప్రభాస్కి జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చింది.. ఆ సినిమాలోని డైలాగులు, సీన్లని గతంలో తమ రాజకీయ ప్రచారానికి కూడా వాడుకుంది బీజేపీ.. అప్పుడే తన పరిచయాలను ఉపయోగించి ప్రధాని మోదీ దగ్గరకు ప్రభాస్ని తీసుకెళ్లారు కృష్ణం రాజు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభాస్… కూడా పెద్దమ్మ రాజకీయ ఎంట్రీకి సై అంటున్నట్లు సమాచారం..
శ్యామల బీజేపీ నుండి రంగంలోకి దిగితే.. ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చెయ్యడం ఖాయం.. ఇదే జగన్ టీమ్ని భయపెడుతోంది.. ఈ ప్రభావం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలపైనా పడడం గ్యారంటీ.. మరి, జగన్.. దీనిని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి..