పంజాబ్ కింగ్స్తో తలపడిన తొలిపోరులో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఆటలో కేవలం 4 పరుగుల తేడాతో రాహుల్ సేన విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శాంసన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్ 63 బంతుల్లో 119 పరుగులతో ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ దీపక్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. అయినప్పటికీ అందరి ప్రశంసలు అందుకున్నాడు.
సంజూ ఒంటరి పోరాటం..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆదిలోనే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. బెన్ స్టోక్స్ డకౌట్ తో నిరాశ పరచగా… మనన్ వోహ్రా 12 పరుగులతోనే వెనుదిరగడంతో సంజూ ఒంటరి పోరాటం చేయక తప్పలేదు. జోస్ బట్లర్ 25 శివమ్ దూబె 23, రియాన్ పరాగ్ 25 పరుగులతో సంజూకి కాస్త అండగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు.
సిక్సర్ల వర్షం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ చేలరేగిపోయింది. బ్యాట్తో విధ్వంసం సృష్టించారు. దిపక్ హుడా 28 బంతుల్లో 64, కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 91 పరుగులతో విరుచుకు పడ్డారు. దిపక్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదేశాడు. చివరికి పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ మూడు వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్ రెండు, రియాన్ పరాగ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Must Read ;- బెంగుళూరు భలే బోణీ.. ముంబయిపై అద్భుత విజయం











