Evaru Meelo Koteeswarulu Show Is Over Is It Real
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ తో స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి ఎందరినో ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ మరోసారి స్మాల్ స్క్రీన్ పైకి వచ్చి సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో హోస్ట్ గా చేస్తూ దూసుకెళుతున్నారు. రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలను ఎన్టీఆర్ ఈ షోకు గెస్ట్ గా పిలవడం జరిగింది. ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్ టైన్ చేశారు. రీసెంట్ గా సమంత గెస్ట్ గా వచ్చింది.
ఈ ఎపిసోడ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇలా సెలబ్రిటీలతో చేసిన ఎపిసోడ్స్ కు మంచి రేటింగ్ వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ఈ షోకు ఎవరు గెస్ట్ గా రానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ షో ముగిసింది అనే వార్త బయటకు వచ్చింది. నిజమా కాదా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, ఎస్.ఎస్. తమన్ లను కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా పిలిచాడట. వాళ్లు రావడం షూట్ చేయడం కూడా జరిగిందట. అయితే.. ఈ ఎపిసోడ్స్ ఇంకా టెలికాస్ట్ కాలేదు.
Evaru Meelo Koteeswarulu Show Is Over Is It Real
ఎప్పుడు ప్రసారం చేస్తారనేది త్వరలోనే ప్రకటించనున్నారు. దీపావళికి మహేష్ బాబు ఎపిసోడ్ ప్రసారం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షో ముగిసిందా అంటే.. ముగిసిందనే అంటున్నారు. ఈ షోకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నవంబరు ఫస్ట్ వీక్ వరకు ఈ షో ప్రసారం కానుందని సమాచారం. ఎన్టీఆర్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేశారు. కొంత గ్యాప్ తర్వాత నెక్ట్స్ సీజన్ స్టార్ట్ చేయనున్నారు. అయితే.. ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎన్టీఆర్ చేసిన ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారని సమాచారం.











