మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై పోలీసులకు చేసిన ఫిర్యాదులను రిటర్నింగ్ అధికారులు పరిశీలించాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ బలవంతపు నామినేషన్ల ఉంపసంహరణ చేయించారన్న ప్రతి పక్షాల ఆరోపణలపై ఎస్ఈసీ స్పందించారు. ఇప్పటికే ఆర్వోలకు నిర్థిష్ట సూచనలు, ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించిన ప్రతి సంఘటనను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తిరుపతి 7వ డివిజన్ లో బలవంతపు ఉపసంహరణపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు తమ సమస్యలను తగిన ఆధారాలతో కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఎస్ఈసీ సూచించారు.
Must Read ;- ఎస్ఈసీ vs వర్ల రామయ్య .. వాడివేడిగా అఖిల పక్ష సమావేశం