అతిరథ మహారథుల దారులన్నీ దామినీడు వైపే ..!
అమరావతి రైతు నినాదానికి అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథలు జతకట్టారు. కలిసి నినదించారు. ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రైతులకు ఆది నుంచి టీడీపీ ఒక్కపార్టీనే కాదు .. ఏపీలో ఉన్న అన్ని రాజకీయపార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పూర్తి మద్దతునిచ్చాయి. ఒకటే రాజధాని.. అది ఏపి అమరావతేనని ఆకాంక్షించారు. శుక్రవారం తిరుపతి వేదికగా అమరావతి పరిరక్షణ ‘మహోద్యమ సభ’..అమరావతి అందరిది అన్న ట్యాగ్ లైన్ తో రైతులు భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల దారులు తిరుపతి రూరల్ మండలంలోని దామినీడు వైపు పయనించాయి. ప్రతి పార్టీ నుంచి పదిమందికి పైగా నేతలు వచ్చి .. సభలోప్రసంగించారు. రైతుల కోసం ఎంత దూరమైన వస్తామని .. రాజధానిని కాపాడుకునేందుకు దేనికైన సిద్దమని తెగెసి చెప్పారు. జగన్ రెడ్డి ముర్ఖత్వంతోనే ఏపీలో పరిస్థితులు ఇలా దాపురించాయని, అమరావతిని తప్పనిసరిగా కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. మధ్యాహ్నం ఒంకటి గంటకు ప్రారంభమైన సభ సాయంత్ర 6 గంటలకు వరకు సాగింది.
సభ వేదికపై ఆశీనులైన అఖిల పక్షం!
రైతుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు సభకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నటుడు శివాజీ, మాజీ మంత్రులు రావెల, పరిటాల, ఆదినారాయణ రెడ్డి తదితరులు ముఖ్యనేతలు వేదికపై ఆశీనులై, ముక్తం కంఠంతో ఏపీ రాజధాని అమరావతేనని తిరుమల గిరుల సాక్షిగా.. వెంకన్న పాదాల కిందా సింహనాదం చేశారు.
Must Read ;- వైఎస్ఆర్ సమాధి సాక్షిగా జగన్ రెడ్డి పచ్చిమోసం ..! కడప నుంచి మరో పాదయాత్ర మొదలు..!!