యంగ్ టైగర్ యన్టీఆర్ కు ఇటీవల కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్ లో.. ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎందరో సినీ సెలబ్రిటీస్ తారక్ తొందరగా రికవర్ అవ్వాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తారక్ కు ఫోన్ చేసి.. ఆయన క్షేమ సమాచారం స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అతను, అతడి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను .త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తారక్’ అంటూ చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.
కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.
God bless @tarak9999— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2021