ఒకవైపు రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో జనం బెంబెలెత్తిపోతుంటే.. మరోవైపు ఐపీఎల్ కావాల్సినంతా వినోదాన్ని పంచుతోంది. కరోనా పోరులో అలసిన జనాల్లో జోష్ నింపుతోంది. ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ భారీ స్కోరు నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జాడేజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. (62 నాటౌట్: 28 బంతుల్లో 4×4, 5×6) ఐపీఎల్ చరిత్రలో మరిచిపోలేని ఇన్సింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్లో వరుసగా 6, 6, N6, 6, 2, 6, 4 బాది ఏకంగా 37 పరుగుల్ని సాధించాడు జడేజా. జడేజా ఇన్సింగ్ తో ఆ జట్టు స్కోరు ఒక్కసారిగా పెరిగింది.
Must Read : తొలి టీ20 ఇంగ్లాండ్ దే.. టీమిండియా ఘోర వైఫల్యం











