ఐపీఎల్ ఆసక్తిగా సాగుతోంది. అందరి అంచనాలకు మించి ఆకట్టుకునేలా జరుగుతోంది. ముంబయి వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ధావన్, పృథ్వీషా బ్యాటుతో చెలరేగిపోయారు. ఫలితంగా 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించేసింది పంత్ సేన.
ధావన్, షా ఆల్ టైమ్ షో…
చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేదనలో ధావన్, షా అద్భుత భాగస్వామ్యం నెలకొల్పింది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు ధావన్-పృథ్వీషా అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షా వెనుదిగిగాడు. దావన్ 85 పరుగుల వద్ద ఔటయ్యాడు. స్టోయినిస్, కెప్టెన్ పంత్.. తర్వాత ఢిల్లీకి గుర్తుండిపోయే విజయాన్ని కట్టబెట్టారు.
ఆదిలోనే తడబడుతూ…
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై తడబడతూ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 7 పరుగుల వద్ద రెండు వికెట్లు పోగొట్టుకుంది. ఆ తర్వాత రైనా(54) అర్ధ శతకంతో ఆకట్టుకోగా, మొయిన్ అలీ 36, రాయుడు 23, జడేజా 26, సామ్ కరన్ 34 పరుగులతో జట్టును గౌరవ ప్రదమైన స్కోరుకు చేర్చారు. దిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, వోక్స్ తలో రెండు వికెట్లు తీయగా, అశ్విన్, టామ్ కరన్ ఒక్కో వికెటు పడగొట్టారు.
Must Read ;- ఐపీఎల్లో ఏఏ జట్టుకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా..?











