సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్.. రిసెంట్ గా రెండో షెడ్యూల్ ను ప్రారంభించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉధృతంగా ఉండడంతో.. షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల మహేశ్ బాబు పెర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దాంతో ముందు జాగ్రత్త చర్యగా.. మహేశ్ బాబు కుటుంబం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ.. డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైన నేపథ్యంలో మహేశ్ బాబు పెర్సనల్ స్టైలిష్ట్ తో కాంటాక్ట్ లోకి వచ్చారు. ఇప్పుడతడికి ఇలా జరగడంతో తక్షణమే .. మహేశ్ బాబు ఫ్యామిలీ హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళారు. ఈ వార్త విన్న వెంటనే మహేశ్ బాబు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Must Read ;- ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్