మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కరోనా పాజిటివ్ రావడంతో గత మూడు రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సబ్బం హరికి ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పలువురు అభిమానులు విశాఖలో ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
Must Read : ఆక్సిజన్ అందక 22 మంది మృతి