అసలు కారణం అదేనా?
కండలు తిగిరిన వీరుడను విధి వంచించింది. ఏపీ కేబినెట్ మంత్రుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ( 49 ) చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆరడుగుల ఆజానుబాహుడుగా కనిపిస్తూ కండలు తిరిగిన దేహంతో పూర్తి ఫిట్నెస్ తో ఉంటారు. అటువంటి వ్యక్తి ఉదయం గుండెపోటుతో మృతి చెందడం అందర్ని కలచివేస్తోంది. ఈ వార్త విని రెండు తెలుగురాష్ట్రాలలోని రాజకీయ, పరిశ్రమ, సినీ, సామాజీక రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గౌతమ్ పార్థివా దేహానికి నివాళులర్పించి, కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఇలా గుండెపోటుతో మరణించడానికి కారణాలేమిటి? అసలు, నిన్న రాత్రి ఏం జరిగింది? దుబాయ్ లో వారం రోజులు పాటు గౌతమ్ రెడ్డి పర్యటనలో ఏం జరిగింది? వంటి పలు ప్రశ్నలు, అనుమానాలు అందరిలో మెదులుతున్నాయి! గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వెనుక పోస్ట్ కోవిడ్ లక్షణాలు కూడా ఉండొచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ కోవిడ్ తరువాత హర్ట్ ఎటాక్స్, కార్డియాక్ అరెస్టులు వంటివి సహజంగా కనిపిస్తుంటాయని మరోవైపు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గౌతమ్ డెత్ కు కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలే కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విశ్రాంతి లేని షేడ్యూల్ టూరే మృతికి కారణమా?
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గత వారం రోజులుగా దుబాయ్ టూర్ లో బిజిబిజిగా గడిపారు. బాగా అసలిపోయారు కూడా. నిన్న ( ఆదివారం ) ఉదయం 3.30 గంటలకు హైదరాబద్ వచ్చారు. వచ్చిన వెంటనే నెల్లూరు మరో కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చారు. వారం రోజులుగా దుబాయ్ ఎక్స్పోలో ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ టూర్ అంతా ఫుల్ బిజి షేడ్యూల్లో మంత్రి గడిపారు. వచ్చిన వెంటనే నెల్లూరులోని ఓ నిశ్చితార్ధం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గౌతమ్ భార్య, మరికొందరు పనివాళ్లతో కలిసి ఆయనను అపోలో కు తరలించారు. అపోలోలో అత్యవరస విభాగంలో చికిత్స అందించిన, వైద్యులు ట్రీట్మెంట్ కు మంత్రి శరీరం స్పందించలేదు! దీంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రేపు నెల్లూరులో పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం మంత్రి పార్థివ దేహం ఉంచనున్నారు. అమెరికాలో చదువుతున్న గౌతమ్ కుమారుడు వచ్చాకనే గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Must Read:-మంత్రి గౌతమ్కు చంద్రబాబు ఘన నివాళి!











