కరోనా లాక్ డౌన్ ఎందరో బతుకుల్ని నడివీధికి ఈడ్చింది. ముఖ్యంగా ఆ టైమ్ లో వలసకూలీలు పడిన బాధ వర్ణనాతీతం. అలాంటి వారి పాలిట దేవుడిగా నిలిచాడు భారతీయ నటుడు సోనూ సూద్. ప్రత్యేక బస్సుల్లో ఎందరో వలస కూలీల్ని తమ స్వస్థలాలకు పంపించి.. వారికి ఆర్ధికంగా కూడా ఎంతగానో సాయపడ్డాడు. ఈ ఎనిమిది నెలల కాలంలో సోనూ సూద్ .. మనసున్న మారాజుగా వార్తల్లో నిలిచాడు. సినీ సెలబ్రిటీస్ కూడా కోరోనా బాధితుల్ని ఆదుకున్నా.. సోనూ స్థాయిలో వారు సాయం చేయలేదన్నది వాస్తవం. సోనూ సాయం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కష్టాల్లో ఉన్న ఎందరికో బాసటగా నిలిచాడు. అలాగే కొందరు చిన్నారులకు కూడా సోనూ ప్రాణం దానం చేశాడు.
ఇప్పుడు మరోసారి సోనూ సూద్ వార్తల్లో నిలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక గ్రామంలో ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఒక పసివాడిని కాపాడడానికి ముందుకొచ్చాడు. జగ్గారావు పల్లె గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు , రజిత దంపతుల నాలుగు నెలల కుమారుడు అద్విత్ శౌర్య గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. హైద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో పరీక్ష చేయించగా.. ఆపరేషన్ కు రూ. 8లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పారు. బాబు తండ్రి బాబు అంత డబ్బు పెట్టలేని పరిస్థితి. దాంతో గ్రామానికి చెందిన కొందరు సోనూ సూద్ కు ట్వీట్ చేయగా..ఆయన వెంటనే స్పందించారు. సర్జరీకయ్యే డబ్బు తాను చెల్లిస్తానని, హైద్రబాద్ ఇన్నోవా ఆసుపత్రిలో ఆపరేషన్ కు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. దాంతో సోనూ భాయ్ ఉదారతను అందరూ ప్రశసిస్తున్నారు.
It’s an urgent surgery.
Surgery is confirmed for tomorrow @InnovaHeart Hospital. Dr. Kona Samba Murthy @konasambamurthy will take good care. All The Best & wishing the kid a speedy recovery. @IlaajIndia https://t.co/LWYHXROaFt
— sonu sood (@SonuSood) November 11, 2020











