January 17, 2021 4:44 AM
18 °c
Hyderabad
22 ° Sun
22 ° Mon
23 ° Tue
25 ° Wed
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

గత కొన్నేళ్లుగా స్వదేశంలో, విదేశాల్లో జట్టును బాగానే నడిపిస్తున్న కెప్టెన్‌ కోహ్లీ.. సిరీస్‌లో మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

December 23, 2020 at 7:31 PM
టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా విరామం తర్వాత తొలి టెస్టు సిరీస్‌. అది కూడా ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియాతో! గత సిరీస్‌ (2018-19)లో కంగారూ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఈ సారి భారీ అంచనాలతో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో విజయం సాధించేందుకు సువర్ణావకాశం. కానీ దారుణమైన బ్యాటింగ్‌తో తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసి ఘోర పరాజయం. ఇదీ క్లుప్తంగా భారత జట్టు ప్రస్తుత పరిస్థితి. సిరీస్‌లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో జట్టు ఇప్పుడేం చేయాలి? జట్టు ముందున్న సవాళ్లు ఏమిటి?

రెండోటెస్టుకు ఆ నలుగురు!

అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్‌ మీద ఆశలు సజీవంగా నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి! ఈ అభిప్రాయం అభిమానుల్లోనూ బలంగా వినిపిస్తోంది. అయితే, బాక్సింగ్‌డే టెస్టులో విజయం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు అంత తేలిక కాదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ జట్టుకు దూరమవ్వడం వల్ల పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో నాలుగు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది.

బౌలింగ్ భారమంతా బుమ్రాపైనే…

గత పర్యటనలో ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోవడంలో పేసర్లు బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారు. 4 మ్యాచ్‌ల్లో బుమ్రా 21 వికెట్లు తీయగా.. షమీ 16 వికెట్లు పడగొట్టాడు. ఒకరు కాకపోతే మరొకరు రాణించి ప్రత్యర్థి భరతం పట్టారు. కానీ ప్రస్తుత సిరీస్‌లో గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు షమీ దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పుడు పూర్తి భారం బుమ్రా, ఉమేశ్‌లపైనే పడనుంది.

పూజారా, రహానేలు నిలిస్తేనే..

కోహ్లీ గైర్హాజరీలో మిగిలిన మ్యాచ్‌ల్లో జట్టు భారాన్ని మోసే బాధ్యత అనుభవజ్ఞులైన పుజారా, రహానేలదే. ఇప్పటివరకూ 66 టెస్టులాడిన రహానె.. 78 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన పుజారా ఆ అనుభవంతో జట్టుకు అండగా నిలవాలి. ముందుగా వీళ్లు తొలి టెస్టు ఓటమిని పక్కనపెట్టి మనసు తేలిక చేసుకోవాలి. బ్యాట్‌తో రాణించి యువ ఆటగాళ్లకు మార్గం చూపించాల్సిన గురుతర బాధ్యత వీళ్లపై ఉంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (43), రహానె (42) ఫర్వాలేదనిపించారు. కానీ వీళ్లు ఈ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది. క్రీజులో ఎక్కువ సమయం గడిపి యువ ఆటగాళ్లతో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ వాళ్లపై ఉన్న ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేయాలి.

కీలక పోరులో కోహ్లీ దూరం..

గత కొన్నేళ్లుగా స్వదేశంలో, విదేశాల్లో జట్టును బాగానే నడిపిస్తున్న కెప్టెన్‌ కోహ్లీ.. సిరీస్‌లో మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ లేని లోటు.. సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న జట్టుపై గట్టి ప్రభావమే చూపనుంది. కోహ్లీ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ ఆ బ్యాటింగ్‌ స్థాయిని అందుకుంటాడా? అన్నది సందేహమే. కేవలం బ్యాట్స్‌మన్‌గానే అని కాదు కోహ్లీ జట్టులో ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. తన దూకుడు, ఉనికి ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడుస్తుంటే.. కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో గ్రీన్‌ను వెనక్కి పంపి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. ఇప్పుడు అతడు లేకున్నా జట్టు అవే ప్రమాణాలను కొనసాగించాలి.

రహానె.. తనదైన ముద్ర వేస్తాడా?

మంచి టెక్నిక్‌ ఉన్న బ్యాట్స్‌మన్‌గా కెరీర్‌ ఆరంభంలో రహానె ఎన్నో ఆశలు రేపాడు. విదేశాల్లో ఫాస్ట్‌, బౌన్సీ పిచ్‌లపై తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేయగల బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ స్థిరత్వమే లేదు. అంచనాలను అందుకోలేకపోయిన అతడు.. తన ప్రతిభకు అతడు న్యాయం చేలేదన్న అభిప్రాయం ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా.. ప్రస్తుతం అతడు జట్టుకు భరోసా ఇచ్చే స్థితిలో లేడు.

ఆటలో పడుతూ.. లేస్తూ…

రహానె… 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆడిన తొలి 13 సిరీస్‌ల్లో అతడు 9 సిరీస్‌ల్లో 50పై సగటు నమోదు చేశాడు. టెస్టు జట్టులో అంతర్భాగమైపోయాడు. అయితే 2017 శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం (సగటు 3.4) కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన (2018)కు టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. విదేశాల్లో మెరుగైన రికార్డున్నా ఎందుకో సెలక్టర్లు అతణ్ని కరుణించలేదు. మరోవైపు రహానె పరిమిత ఓవర్ల కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలతో సాగింది. కుర్రాళ్లతో పోటీ పడలేక వన్డే, టీ20 జట్లలో చోటు కోల్పోయాడు. టెస్టుల్లో కీలక ఆటగాడిగా ఎదిగి, వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు కూడా అందుకున్నాడు. కానీ ఈ మధ్య ఆ ఫార్మాట్లోనూ అతడి ముద్ర కనిపించడం లేదు. ఒకప్పటి జోరును, స్థిరత్వాన్ని అందుకోలేకపోయాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత 23 టెస్టులు ఆడిన అతడు కేవలం రెండే శతకాలు సాధించాడు. సగటు 40 లోపే.

26న మెల్బోర్న్‌లో రెండోటెస్టు..

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన టీమ్ఇండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్ధ పడుతోంది. ఈనెల 26న మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు మొదలవుతుంది. జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తుండగా.. ఆఖరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది.  అయితే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షెడ్యూల్లో ఏమైనా మార్పులు చేస్తారేమో అనే ఊహాగానాలు విపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఏ తాత్కాలిక సీఈఓ నిక్‌ హాక్లే ఓ కీలక ప్రకటన చేశారు.

‘షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. సిడ్నీ క్రికెట్‌ మైదానంలో మ్యాచ్‌ నిర్వహణకే మా తొలి ప్రాధాన్యత. క్రికెట్‌ సమర్థ నిర్వహణకు సీఏ పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. బయో భద్రత బృందం, ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలు, ఆసీస్‌ క్రికెటర్లతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం’ అని సీఏ తాత్కాలిక సీఈఓ నిక్‌ హాక్లే ఓ అధికారిక ప్రకటనలో చెప్పాడు.

సిరీస్‌ ఏదైనా సరే మంచి ఆరంభం దక్కితే జట్టు ఆత్మవిశ్వాసం పెరుగుతుందనడంలో సందేహం లేదు. పైగా ఆస్ట్రేలియాతో దాని సొంతగడ్డపై సిరీస్‌ అంటే కచ్చితంగా విజయారంభం చేయాలి. అలా చేస్తేనే జట్టు మానసికంగా బలంగా మారడం సహా ప్రత్యర్థిని వెనక్కినెట్టినట్లు అవుతుంది. కానీ టీమ్‌ఇండియా ప్రతిష్ఠాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని పరాజయంతో మొదలెట్టింది. అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. భారత క్రికెట్‌ చరిత్రలో ఓ పీడకలలా మిగిలిపోయే పేలవ ప్రదర్శనతో అభిమానులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. కంగారూ జట్టుతో సిరీస్‌ అంటే తొలి మ్యాచ్‌లో మామూలుగా ఓడితేనే పుంజుకోవడం కష్టం.. అలాంటిది ఈ స్థాయిలో ఓటమితో పాటు అప్రతిష్ఠ మూటగట్టుకున్న భారత్‌ తిరిగి పుంజుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే!

Tags: kohli
Previous Post

గణపయ్య సాక్షిగా ఎమ్మెల్యే, మాజీల సత్యప్రమాణాలు.. అనపర్తిలో ఉద్రిక్తత

Next Post

“నో పెళ్లి..” పాట అంటే అమ్మకు కోపం!

Related Posts

General
సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

by లియో రిపోర్టర్
January 17, 2021 4:25 am

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం...

General
కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

by లియో రిపోర్టర్
January 16, 2021 7:38 pm

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో 954 మందికి తొలిరోజు...

Editors Pick
రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

by లియో రిపోర్టర్
January 16, 2021 7:34 pm

తెలంగాణ బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ళేందుకు మ‌రో నినాదం ఎంచుకుంది. ఇప్ప‌టికే పార్టీపై ప్ర‌జ‌ల్లో...

General
పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

by chamundi G
January 16, 2021 6:06 pm

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త అధ్యాయం. కలహాలు.. అలకలు.. అంతలోనే బుజ్జగింపులు.....

General
వాట్సప్ కొత్త పాలసీ ఏంటి? మన డేటా భద్రమేనా?

గుడ్ న్యూస్! వాట్సప్ అప్‌డేట్‌ చేయాల్సిన పనిలేదంట!

by chamundi G
January 16, 2021 5:13 pm

ప్రస్తుతం వాట్సప్ పరిస్థితి చూస్తంటే.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ అనే సామెత...

Editors Pick
అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

by లియో రిపోర్టర్
January 16, 2021 4:45 pm

టీఆర్ పీ రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి...

Andhra Pradesh
ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

by లియో రిపోర్టర్
January 16, 2021 3:45 pm

గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలు కొడుతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి...

General
రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

by లియో రిపోర్టర్
January 16, 2021 3:39 pm

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం...

General
రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

by లియో రిపోర్టర్
January 16, 2021 3:31 pm

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం...

Andhra Pradesh
దేశ వ్యాప్తంగా డ్రై రన్ నేడే..

కోవిన్ యాప్స్ మొరాయింపు.. ఏపీలో పలు చోట్ల మొదలుకాని వ్యాక్సినేషన్..

by chamundi G
January 16, 2021 2:24 pm

దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొన్న చోట్ల అవరోధాలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

 ‘భూమా’ కోటలో అంతా తానై నడిపిస్తున్న మౌనిక రెడ్డి..

సినీఫక్కీలో వినోద్ అరెస్టు : ఎంపీ కింజరాపు నిరసన

ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ఆల‌యాలపై దాడుల‌పై డీజీపీ యూట‌ర్న్… రీజనేంటంటే?

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

తెలుగు రాష్ట్రాలలో తొలి టీకా వేయించుకున్న మహిళామణులు

ముఖ్య కథనాలు

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

‘రాష్ట్రంలో విధ్వంసాలు చేయిస్తున్నది చంద్రబాబే’

ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా

ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ఆల‌యాలపై దాడుల‌పై డీజీపీ యూట‌ర్న్… రీజనేంటంటే?

బిగ్ ఫైట్ : సాగ‌ర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెగాస్టార్ ఫ్యామిలీ బంధువు.‌.?

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

సినిమా

స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

‘క్రాక్’ దర్శకుడి దశ తిరిగింది.. !

రీ ఎంట్రీ ఇస్తానంటున్న ‘ఆనందం’ హీరోయిన్

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

‘కేజీఎఫ్ 2’ డైరెక్ట‌ర్ ని ఆకాశానికి ఎత్తేసిన వ‌ర్మ‌

జనరల్

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

గుడ్ న్యూస్! వాట్సప్ అప్‌డేట్‌ చేయాల్సిన పనిలేదంట!

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

కోవిన్ యాప్స్ మొరాయింపు.. ఏపీలో పలు చోట్ల మొదలుకాని వ్యాక్సినేషన్..

హార్వర్డ్ వర్సిటీ పేరుతో జర్నలిస్టుపై సైబర్ అటాక్

తెలుగు రాష్ట్రాలలో తొలి టీకా వేయించుకున్న మహిళామణులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist