చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అంతే కాదు ఈ కేసు వ్యవహారం న్యాయ వ్యవస్థకూ కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు, అరెస్ట్కు గవర్నర్ అనుమతి అవసరమా కాదా అన్న చర్చ దేశమంతా జరుగుతోంది. తలలు పండిన న్యాయకోవిదులు సైతం చట్టాలు, నిబంధల ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇదంతా ఇక పథకం ప్రకారం జరుగుతోందని అందరికీ అర్థమవుతోంది. నెల రోజులుగా ఈ చర్చ జరుగుతున్నా ప్రభుత్వం తరపునుంచి ఒక్క న్యాయవాది కూడా గవర్నర్ నజీర్ను సంపదించిన సందర్భం లేదు.
అయితే అసలు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. జరుగుతున్న పరిణామాలపై పలు మీడియాల్లో కథనాలు రావటంతో రాజభవన్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో అసలేం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్వాపరాలేమిటి.. ప్రభుత్వం తననెందుకు సంప్రదించలేదు, వెనుక ఉన్న కారణాలేమిటన్న విషయంపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ నజీర్ అహ్మద్ సంబంధిత అధికారులను వివరణ కోరటం సంచలమైంది.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులు బలమైనవికావనని, అరెస్ట్కు అనుమతి కోరితే గవర్నర్ నో అంటారని తెలిసే అధికారులు ఆయన అనుమతి కోరలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ జరిగిన ఈ పరిణామం వైసీపీలో కలకలం రేపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఐడీ చీఫ్, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తదితరులు గవర్నర్ను కలిశారు.
అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే జరిగింది కనుక గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న ప్రస్తావన రాలేదని వాళ్లంతా గవర్నర్కు వివరించే ప్రయత్నం చేశారట. ఇంత లెక్కలేని తనమా అంటూ వారిపై ముఖ్యంగా సీఐడీ చీఫ్పై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కీలమైన పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు గవర్నర్కు నివేదించటం ప్రభుత్వం ప్రధాన బాధ్యత అన్న విషయం మరిపోద్దని ఆయనకు గవర్నర్ చివాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో పాటు అసలు ఈ ప్రాజెక్ట్ వివరాలేమిటి. కేసు పూర్వాపరాలేమిటి వంటి అంశాలను కూడా గవర్నర్ న్యాయ నిపుణులనడిగి వివరాలు సేకరించారట. ఇంత జరుగుతున్నా తనతో ఒక్క మాట కూడా చెప్పకపోవటమేమిటని ఆయన ప్రశ్నించారట కూడా.