(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
అయ్యో రామా ..! రాములోరి శిరస్సును ఖండించేశారు దుండగులు .. మీ మీద అభాండాలు వేశారు కొందరు పెద్దలు .. వాటిని తుద ముట్టించేందుకు ..ఈ వయస్సులో ఇంత ఎత్తులో ఉన్న కొండలు దాటి .. మెట్లు ఎక్కి ఇంతదూరం వచ్చారు.. అయినా రాములోరి విగ్రహ దర్శనం చేయించలేకపోయాం .. బాబు మేం నిమిత్తమాత్రులం .. మమ్మల్ని క్షమించండి .. మేమైతే ఒక మాట చెప్పగలం .. నిండు మనస్సుతో ఆశీర్వదించగలం .. రాములోరికొచ్చిన కష్టం మీకొచ్చింది బాబు .. అడవిలో నివసిస్తూ , ఆకులూ అలములు తింటూ .. కష్టాలను, కడగండ్లను అధిగమిస్తూ .. అయోధ్య రామునిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు ఆ కోదండ రాముడు .. అలాగే మీకూ ఒక రోజు వస్తుంది .. ఆ కష్టాలు తీరుతాయి .. ఆంధ్రప్రదేశ్ అధినేతగా పట్టాభిషిక్తులు అవుతారు .. అంతవరకూ ఓపిక పట్టండి .. సహనం వహించండి .. అప్పుడు మళ్లీ ఇక్కడికి రండి .. పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతాం .. రాచ మర్యాదలతో దైవదర్శనం కల్పిస్తాం .. ఆ రాముడు మీకు అండగా నిలుస్తాడు .. ఈ సారికి మమ్మల్ని మన్నించండి బాబు .. ముకులిత హస్తాలతో .. బాధాతప్త హృదయంతో మన్నించమని వేడుకుంటున్నాం బాబూ ……చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం నాయకులు .. కార్యకర్తలు .. పైన చెప్పినట్టే భావిస్తున్నారు .. విశ్వసిస్తున్నారు .
విగ్రహ రాజకీయాలా ..?
విజయనగరం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో కోదండరాముని శిరస్సును ఖండించడాన్ని తప్పు పడుతూ, తనపై మోపబడిన అభియోగాలను పటాపంచలు చేసుకునేందుకు .. వాస్తవాలను తెలుసుకునేందుకు .. అమరావతి నుండి రామతీర్థం వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును .. ఆ కోదండరాముని విగ్రహం చూసే అవకాశం కల్పించకపోవడం .. ఆలయానికి తాళాలు వేయడం .. అంతకు ముందు అక్కడకు వెళ్లిన కొంతమంది పెద్దలకు ఆలయం తలుపులు బార్లా తెరిచి .. సాదరస్వాగతం పలికి దర్శన భాగ్యం కల్పించడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి .. ఇదేమి రాజకీయం అనే ప్రశ్న తలెత్తుతోంది .. రాములోరితో పరాచకాలా ..? విగ్రహ రాజకీయాలా ..? అనే శాపనార్థాలు వినిపిస్తున్నాయి .
పూర్వవైభవం తీసుకురావాలి
గోరంతతో పోయే దానికి .. కొండంత చేసి .. రాష్ట్ర రాజకీయాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంను వేదికగా మార్చడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.. జై శ్రీరామ్ అనే రామనామ స్మరణతో నిత్యం మారుమోగే ఆధ్యాత్మిక స్థలాన్ని నిరసన జ్వాలలతో రగల్చడం సరైనది కాదంటున్నారు .. ఇప్పటికైనా ఈ కుహనా రాజకీయాలకు స్వస్తి చెప్పి .. అసలైన నిందితులను పట్టుకోవాలని .. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని .. రామతీర్థంకు పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read: అందరికీ అండగా.. ఇక అమరావతిలోనే చంద్రబాబు











