ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, అమరావతి, నెల్లూరు, కృష్ణపట్నం ప్రాంతాలను కలుపుతూ రాష్ట్రంలో భారీ ఆక్వా కారిడార్ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
చేపలు, రొయ్యల పెంపకంపై రీసెర్చ్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్స్తో పాటు స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా.. ఆక్వా రైతులకు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి అతి తక్కువ ఖర్చుతో.. అత్యధిక ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా ఆక్వా కారిడార్ని డెవలప్ చేస్తారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న మత్స్య సంపదకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించడానికి ఆంధ్రా ష్రింప్.. ఇండియా సీ ఫుడ్ అనే బ్రాండ్ను ప్రమోట్ చేయాలని నిర్ణయించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు వేగంగా అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. అక్వా రంగంలో ఇన్నోవేషన్, స్టార్టప్ సంస్థలు ఏపీలో ఇన్వెస్ట్ చేయాలని ఆహ్వానించారు. పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్, బ్లూ ఎకానమీ టు వికసిత్ భారత్ నినాదంతో.. స్టేక్ హోల్డర్లందరూ ఆక్వా రంగం అభివృద్ధి కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
భారతదేశ అక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి చేసే చేపల్లో రాష్ట్రం వాటా 28 శాతమైతే.. రోయ్యల ఉత్పత్తిలో 66 శాతం షేర్ ఏపీదే. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా దేశానికి వచ్చే ఆదాయంలో 38 శాతం అంటే దాదాపు 28 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 197 టన్నుల సీ ఫుడ్ ఉత్పత్తి జరుగుతోంది. అయినా ప్రపంచ సీ ఫుడ్ బిజినెస్లో ఇండియా వాటా కేవలం 5 శాతం మాత్రమే. విశ్వంలోని మొత్తం జనాభాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారత్.. సీ ఫుడ్ ప్రొడక్షన్లోనూ 20 శాతం మార్కు సాధిస్తే.. బ్లూ ఎకానమీ బూమ్ వస్తుంది. అంత భారీ అవకాశాలు ఉన్నందు వల్లే.. ఏపీ సీఎం చంద్రబాబు బ్లూ ఎకానమీ అభివృద్దిపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు.











