వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు కడపలో గట్టి రివర్స్ కౌంటర్ పడింది. మా తాత రాజారెడ్డిని చం*పిన వాళ్లను కూడా మేమేం చేయలేదు.. వదిలేశామంటూ జగన్ సానుభూతి కోసం మాట్లాడటంపై రాజారెడ్డి హ*త్య కేసులో నిందితుడు పేర్ల పార్థసారథిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ రాజారెడ్డిని ఏదో పెద్ద మహాత్ముడిగా చూపించే ప్రయత్నాలు చేయొద్దని, ఆయన బతికినంత కాలం హింసతోనే బతికారని పార్థసారథిరెడ్డి కుండబద్దలు కొట్టారు. జగన్ తనకు ఏదో ప్రాణభిక్ష పెట్టినట్టు మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తోందని, వైఎస్ ఫ్యామిలీ అసలు రంగు ఏంటో పులివెందుల జనాలందరికీ బాగా తెలుసని దెప్పిపొడిచారు.
మీ తాత మనుషులు నన్ను ఎలా నరికారో..అలాగే మీ తాతను కూడా నా వర్గీయులు నరికారంటూ పార్థసారథిరెడ్డి జగన్కు పాత రోజులను గుర్తు చేశారు. మీ నాన్న YSR కేవలం రాజకీయాలే నేర్పించారని పైకి బిల్డప్ ఇస్తున్నారని, కానీ తెరవెనుక నా ఆర్థిక బలాన్ని దెబ్బతీసి, నా మనుషులను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా హింసించారని ఆరోపించారు. గతంలో తనపై జరిగిన హ*త్యాయత్నం వెనుక వైఎస్ కుటుంబమే ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. మీరంతా పైకి బాగానే కనిపిస్తారు కానీ లోపల తేనె పూసిన కత్తులని, దంతులూరి కృష్ణతో కలిసి నాపై సూట్కేస్ బాంబు వేసి చని*పోయాడనుకుని వదిలేసి వెళ్ళింది నిజం కాదా అంటూ జగన్ను సూటిగా నిలదీశారు.
వైఎస్ కుటుంబానికి ఉన్న నేర చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్న పార్థసారథిరెడ్డి..జగన్ హ*త్యా రాజకీయాల వల్లే తాను తన తమ్ముణ్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తామేదో త్యాగాలు చేసినట్టు జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇదే చేత్తో గతంలో వైఎస్ వివేకానందరెడ్డిని జగన్ చెంపదెబ్బ కొట్టిన ఉదంతాన్ని కూడా ఆయన బయటపెట్టారు. బాధితులం మేమైతే, తమకు ప్రాణభిక్ష పెట్టామంటూ జగన్ కలరింగ్ ఇచ్చుకోవడంపై కడప జనాలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.











