యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు రోజుల వేడుకల్లో దిగ్గజాల సరసన మంగళగిరి నాయకులు జెండా ఆవిష్కరణలో గాదే పిచ్చిరెడ్డి, ఎన్టీఆర్ కు నివాళి కార్యక్రమంలో తాటి వెంకట్రావు, మహానాడు వేదికపై గుత్తికొండ ధనుంజయరావు
మంగళగిరి రాజకీయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ మహానాడు… తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత వేడుకగా జరుపుకునే అతిపెద్ద పండుగ. వాడవాడల పసుపు తోరణాలతో పండుగ వాతావరణాన్ని తలపింప చేస్తుంది. ఇక ఈసారి మహానాడు అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకుంది… తొలిసారిగా మంగళగిరిలో మహానాడు నిర్వహిస్తుండడం విశేషం! వర్చువల్ విధానంలో భారీ స్థాయిలో మహానాడు -2026 ను అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు పసుపు పండుగ మంగళగిరి వేదికగా జరుగుతుండటం ఓ ప్రత్యేకత కాగా… ఇంత గొప్ప వేదికపై మన మంగళగిరి నాయకులు దిగ్గజాల సరసన మహానాడులో పాల్గొనడం అనేది మనం కలలో కూడా ఊహించి ఉండం… మంగళగిరి చరిత్రలో ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతకు ముందున్నడూ చూడలేదు… భవిష్యత్తులోనూ చూస్తామనే నమ్మకం కలగడం లేదు… మరి తెలుగుదేశం పార్టీలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావటానికి కారకులు ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈసారి మహానాడు… క్లస్టర్ ప్రాతిపదికగా 1845 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయం మంగళగిరి (ఆత్మకూరు లిమిట్స్) లో ఉండటం… ఈ ప్రాంత నాయకులకు కలిసి వచ్చింది. రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్ టి జి ఎస్ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఈ ప్రాంత నేతలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అంతే కాదు నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక వర్గాల వారీగా పెద్దపీట వేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఓ మోడల్ గా తీర్చిదిద్దాలనే యువగళం రథసారథి నారా లోకేష్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అటు అభివృద్ధిలోనూ… ఇటు సంక్షేమంలోనూ… మంగళగిరి అగ్రప్రథాన నిలవడానికి ‘మన మంగళగిరి- మన లోకేష్’ సంకల్పం తోడైంది. మంగళాద్రి దివ్య క్షేత్రం ఆధ్యాత్మికంగా… పర్యాటకంగా ప్రాచుర్యం పొందేలా కార్యచరణ మొదలైంది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి మంగళగిరి చేనేత వస్త్రాలకు మరింత వన్నెతెస్తున్నారు.
ఇక మంగళగిరిలో తొలిసారి జరుగుతున్న హైబ్రిడ్ మహానాడులో మన మంగళగిరి ప్రాంత నాయకులకు ప్రత్యేక గుర్తింపునివ్వటం మామూలు విషయం కాదు… తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల సరసన మన మంగళగిరి నాయకులు ఉండటం గొప్ప విషయం… మహానాడు ప్రారంభ సూచికంగా జెండా ఆవిష్కరణలో ఆత్మకూరు రూరల్ క్లస్టర్ ఇంచార్జ్, మంగళగిరి పిఎసిఎస్ చైర్ పర్సన్ గాదె పిచ్చిరెడ్డి పాలోపంచుకోగా… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పుష్ప నివాళి కార్యక్రమంలో టిడిపి ఆత్మకూరు గ్రామ ప్రెసిడెంట్ తాటి వెంకట్రావు పాల్గొనడమనేది అత్యంత అరుదుగా వచ్చే అవకాశం… ఇక మంగళగిరి చేనేత బిడ్డ గుత్తికొండ ధనుంజయరావు పొలిట్ బ్యూరో సభ్యులుగా మహానాడు వేదికపై ఆశీనులు కావటం… ముచ్చటగా మన మంగళగిరి నాయకులు ముగ్గురు… దిగ్గజాల సరసన నిలవడం అపూర్వం… అద్భుతం… మన మంగళగిరి నాయకులకు ఇంతటి అపూర్వ అవకాశం లభించడం మంగళగిరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టం. రాజకీయ చరిత్రలో మరువలేని, మరుపురాని మధుర క్షణాలను ఆవిష్కరింపజేసిన మన మంగళగిరి ప్రజాప్రతినిధి యువగళం రథసారథి నారా లోకేష్ కృషి ఎంత చెప్పినా తక్కువే… ఈ మహానాడు మరీ ముఖ్యంగా మన మంగళగిరిలో తొలిసారి జరగటం… అలాగే మన మంగళగిరి ప్రాంత నాయకులకు అత్యంత ప్రాధాన్యం లభించడం ఇవన్నీ భవిష్యత్ తరాలకు శుభసూచికలుగా నిలుస్తాయి. తథాస్తు!











