కరోనా కేసులు పెరుగుతుండటంతో అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేయనున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేస్తున్నట్లు, అన్ని విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఆన్లైన్ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. మెడికల్ కాలేజీలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు.
మంత్రి సబితారెడ్డి ప్రకటనకు ముందే విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల విషయంపై మంత్రి, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున వాటిని కొద్ది కాలం మూసివేసేలా అధికారులు, సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో మంగళవారం ఉదయమే మంత్రి ఈటల రాజేందర్ వైద్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితులను సమీక్షిస్తున్న ఆయన అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర సమయంలోనే బయటకు రావాలని సూచించారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపిన విద్యాశాఖ మంత్రి శ్రీమతి @SabithaindraTRS. pic.twitter.com/aGk1i0cqog
— TRS Party (@trspartyonline) March 23, 2021
Must Read ;- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : కరోనాపై మంత్రి ఈటల సమీక్ష