తెలంగాణ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైద్యశాఖపై సీఎస్ సోమేశ్కుమార్, ఇతర అధికారులతో హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ సమీక్ష జరిపారు. కరోనా కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని, రోజుకు 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజల భాగస్వామ్యంతోనే కట్టడి సాధ్యమని మంత్రి అన్నారు. కొవిడ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు.
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, పక్క రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. జనాలు భౌతిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప, బయటికి రావొద్దని సూచించారు. జనాల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయని, కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Must Read ;- కరోనా వస్తే ఏం తినాలి?











