యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం కేసీఆర్ దర్శించుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా సీఎం ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రీశుడి ఆలయం పనులను సీఎం పరిశీలించారు. డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయ పనులపై కీలక సూచనలు..
యాదాద్రిలో గతంలో పర్యటించినప్పుడు సీఎం పలు సూచనలు చేశారు. అవన్నీ జరిగాయా? ఇంకా పూర్తి కావాల్సిన పనులేంటి? అనే విషయాల గురించి తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానాలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ స్థపతి ఆనందాచారి వేలు, ఆనంద్సాయిని నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాడ వీధులు, ప్రాకార మండపాలు, విద్యుద్దీపాలు, దర్శన సముదాయాలను, తూర్పు రాజగోపురం, బ్రహ్మోత్సవం మండపాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
ఐదున్నర నెలల తర్వాత..
గతేడాది సెప్టెంబర్ 13న సీఎం ఆలయానికి వచ్చారు. మళ్లీ ఐదున్నర నెలల తర్వాత యాదాద్రికి రాగా.. ఈ పర్యటనలో స్వామి వారి పునః దర్శనాలపై సీఎం స్పష్టత ఇస్తారని భక్తులు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రూ.1200 కోట్లతో పంచనారసింహ క్షేత్రం పునః నిర్మాణ పనులను 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. కృష్ణశిలతో నిర్మించిన ఆలయం ప్రస్తుతం పూర్తి కావచ్చింది. 4.33 ఎకరాల్లో అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో ఆలయం అలరాలుతోంది.
Must Read ;- పీవీకి, కేసీఆర్కు నక్కకు నాగలోకానకి ఉన్నంత తేడా ఉంది..











